Ram Charan: వైజాగ్ లో చెర్రీ క్రేజ్.. షాక్ లో ఎస్.జే.సూర్య..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినీ ఇండస్ట్రీలోకి చిరుత అనే సినిమా ద్వారా అడుగుపెట్టి మంచి సక్సెస్ అందుకున్నారు.. అయితే మెగాస్టార్ చిరంజీవి వారసుడు అన్న ఒక్క కారణంతో ఈ సినిమా హిట్ అయిందనే వార్తలు వినిపించాయి.. అంతేకాదు రామ్ చరణ్ కి అసలు నటనే రాదు అని, తండ్రి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా చాలామంది ట్రోల్స్ చేశారు.. కానీ ఇవేవీ పట్టించుకోకుండా తన సొంత టాలెంట్ తో ఎదిగి నేడు గ్లోబల్ స్టార్ గా పేరు దక్కించుకున్నారు రామ్ చరణ్..

రామ్ చరణ్ కెరియర్..
ఆయన అభిమానుల్ని చూసి షాక్ లో విలన్..రాజమౌళి దర్శకత్వంలో తన రెండవ చిత్రం మగధీర సినిమా చేసి తన నటనతో తనపై ట్రోల్స్ చేసిన వారి నోళ్ళు మూయించిన రామ్ చరణ్.. ఆ తర్వాత వరుసగా కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ భారీ సక్సెస్ అందుకున్నారు. మరోసారి రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేసి గ్లోబల్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు.. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ కి ఒక రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు నేడు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారటంలో సందేహం లేదు..

RC 15 కొత్త షెడ్యూల్..
ఇక ప్రస్తుతం ఈయన ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్‌ సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నేటి నుంచి వైజాగ్ లో జరగనుంది.. అక్కడి ఆర్కే బీచ్ లో ఐదు రోజులపాటు కీలక షెడ్యూల్ జరగబోతోంది.. ఈ క్రమంలోనే బీచ్ సమీపంలో పెద్ద పొలిటికల్ మీటింగ్ సెట్ ని కూడా నిర్మించారు.. ఇక ఈ షూటింగ్ కోసం మూవీ టీం అంతా నిన్ననే వైజాగ్ చేరుకుంది.. ఈ క్రమంలోనే రామ్ చరణ్ , శంకర్ , ఎస్ జె సూర్యతో పాటు ఈ షెడ్యూల్లో పాల్గొనవలసిన మరికొంతమంది నటీనటులు కూడా వైజాగ్ కి చేరుకున్నారు.

- Advertisement -

రామ్ చరణ్ అభిమానుల్ని చూసి షాక్ లో ఎస్ జె సూర్య..
ఇక రామ్ చరణ్ వస్తున్నాడు అని తెలియడంతో ఆయన అభిమానులు చేసిన హడావిడి అంతా ఇంత కాదని చెప్పాలి. నిన్న సాయంత్రం నుంచే వైజాగ్ ఎయిర్పోర్ట్ వద్ద తమ అభిమాన హీరో కోసం ఎదురుచూపులు చూశారు.. దీంతో ఎయిర్ పోర్ట్ మొత్తం రామ్ చరణ్ అభిమానులతో కోలాహాలంగా మారింది.. ఇక ఎయిర్పోర్ట్ లోకి రామ్ చరణ్ అడుగుపెట్టగానే.. జై చరణ్.. జై జై చరణ్ అంటూ అభిమానులు గోల చేశారు. ఇక రామ్ చరణ్ భారీ అభిమానాన్ని చూసిన ఎస్ జే సూర్య ఒక్కసారిగా షాక్ అయ్యారు.. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్లకుండా కాసేపు వచ్చిన భారీ అభిమానులు చూస్తూ అలా నిలుచుండి పోయారు.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే మార్చి 19వ తేదీ వరకు వైజాగ్ లోనే ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా మార్చి 20న రాంచరణ్ హైదరాబాద్ వచ్చి ఆర్సి 16 మూవీ ని పూజా కార్యక్రమాలతో లాంచ్ చేయబోతున్నారట.. ఇక మార్చి 21 నుంచి మళ్లీ హైదరాబాదులో గేమ్ ఛేంజర్‌ సినిమా కొత్త షెడ్యూల్ ని ఆరంభించబోతున్నట్లు సమాచారం .మే నెలలోపు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసేలా శంకర్ ప్లాన్ చేస్తున్నారు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు