RRR : చెర్రీ, తారక్ లతో ముందుగా ప్లాన్ చేసింది ఆర్ఆర్ఆర్ కాదు… ప్లాన్ మొత్తం మార్చేసిన జక్కన్న సతీమణి

RRR : ట్రిపుల్ ఆర్ మూవీతో దర్శక ధీరుడు రాజమౌళి హీరోలు రామ్ చరణ్, తారక్ లను పాన్ ఇండియా స్టార్లుగా మార్చారు. అలాగే టాలీవుడ్ కీర్తిని ఆస్కార్ దాకా తీసుకెళ్లారు. కానీ ఈ మూవీ కంటే ముందే జక్కన్న ఎన్టీఆర్, చెర్రీలతో కలిసి ఒక ఇంట్రెస్టింగ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీని ప్లాన్ చేశారట. కానీ ఆయన ప్లాన్ మొత్తాన్ని రాజమౌళి భార్య రమా రాజమౌళి చెడగొట్టేసిందట. ఇంతకీ ఆమె ఆ లవ్ స్టోరీని ఎందుకు చేయనివ్వలేదు? అనే వివరాల్లోకి వెళ్తే…

ప్లాన్ మొత్తం మార్చేసిన జక్కన్న సతీమణి

జక్కన్న తీర్చిదిద్దిన ట్రిపుల్ ఆర్ మూవీ మెగా పవర్ స్టార్ రామ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరియర్లను పూర్తిగా మార్చేసింది. ప్రస్తుతం వీరిద్దరూ పాన్ ఇండియా స్టార్లుగా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. మరోవైపు గ్లోబల్ స్టార్లుగా ఎదిగే అవకాశాలను వెతుక్కుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఆర్ఆర్ఆర్ మూవీ కంటే ముందే చెర్రీ ఎన్టీఆర్ లతో కలిసి రాజమౌళి ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీని ప్లాన్ చేయగా, ఆయన సతీమణి రామా రాజమౌళి మొత్తం చెడగొట్టేసిందట.

నిజానికి రాజమౌళి ముందుగా ఎన్టీఆర్, చెర్రీ హీరోగా అనుకున్న మూవీ ఆర్ఆర్ఆర్ కాదట. వీరిద్దరిని దృష్టిలో పెట్టుకుని ఒక స్మాల్ స్కేల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీని రాసుకున్నారట జక్కన్న. ఓ స్టార్ హీరోయిన్ తో ఈ మూవీని రూపొందించాలని ప్లాన్ చేసుకున్నారట. కానీ ఈ విషయం తెలిసిన రాజమౌళి భార్య రమా… జక్కన్న నుంచి ఎవ్వరూ ఇలాంటి లవ్ స్టోరీని ఎక్స్పెక్ట్ చేయట్లేదని, ఇద్దరూ మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్న హీరోలు కాబట్టీ థింక్ బిగ్ అంటూ సలహా ఇచ్చిందట. దీంతో రాజమౌళి ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ని పక్కన పెట్టి రామ్, భీమ్ అంటూ ఆర్ఆర్ఆర్ స్టోరీని తెరపైకి తీసుకొచ్చారట. అలా రమా రాజమౌళి కారణంగా చెర్రీ, తారక్ హీరోలుగా రావాల్సిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఆగిపోయింది.

- Advertisement -

అది ఆగిపోవడమే మంచిదైంది

రాజమౌళి రూపొందించిన బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా మూవీ బాహుబలి ఫ్రాంచైజీ తర్వాత అంత కంటే బిగ్ స్కేల్ లో ట్రిపుల్ ఆర్ తెరపైకి వచ్చింది. ఆర్ఆర్ఆర్ మూవీకి రమా రాజమౌళి ఇచ్చిన ఆ సలహానే దారి తీసిందన్నమాట. కానీ జక్కన్న ఆమె మాట వినకుండా ఒకవేళ అలా చిన్న ట్రయాంగిల్ లవ్ స్టోరీ తీసి ఉంటే నేడు అటు తారక్, ఇటు చెర్రీ ఈ రేంజ్ పాన్ ఇండియా స్టార్ డం చూసేవాళ్ళు కాదనేది మాత్రం కాదనలేని సత్యం. పైగా ఈ మూవీతో జక్కన్న కీర్తి ఆస్కార్ ను దాటేసింది. అందుకే ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ అప్పుడప్పుడు భార్యల మాట వినాలి.

ఇక ఇటీవల కాలంలో రాజమౌళి దంపతులు తెగ వార్తల్లో నిలుస్తున్నారు. రీసెంట్ గా వీరిద్దరూ అందమైన ప్రేమ రాణి అనే పాపులర్ రొమాంటిక్ సాంగ్ కు డాన్స్ చేస్తూ కనిపించిన వీడియో తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం జక్కన్న మహేష్ బాబును పాన్ వరల్డ్ హీరోని చేసే పనిలో పడ్డారు. SSMB 29 మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. మరోవైపు రాంచరణ్ గేమ్ ఛేంజర్, తారక్ దేవర అనే పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు