Eagle : ఆ హీరోతో మల్టీ స్టారర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రవితేజ

గత కొద్దీ రోజుల క్రితంఒక మల్టీస్టారర్ సినిమా గురించిన న్యూస్ వైరల్ అయిన విషయం తెలిసిందే. మాస్ మహారాజ్ రవితేజ, యంగ్ హీరో విశ్వక్ సేన్ కలిసి ఒక మల్టీస్టారర్ సినిమా రాబోతుందని కొద్దీ రోజుల క్రితం న్యూస్ రాగా అందరిలో కన్ఫ్యూజన్ మొదలైంది. వరుస సినిమాలతో బిజీగా ఈ ఇద్దరు హీరోలు కలిసి మల్టీస్టారర్ సినిమా చేయడమేంటనీ అందరు ఈ వార్తలను కొట్టిపారేశారు. కానీ ఈ న్యూస్ నిజమే అన్నట్టుగా లేటెస్ట్ గా ఒక అప్డేట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

సుహాస్ ను హీరోగా పరిచయం చేస్తూ వచ్చిన కలర్ ఫోటో సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న దర్శకుడు సందీప్ రాజ్. మొదటి సినిమాతోనే తానేంటో ప్రూవ్ చేసుకొని ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు. అయితే కలర్ ఫోటో సినిమా తరువాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న సందీప్ ప్రస్తుతం రవితేజ- విశ్వక్ సేన్ లతో ఒక మల్టీస్టారర్ సినిమా ప్లాన్ చేస్తునట్టు న్యూస్ వచ్చిన విషయం అందరికి తెలిసిందే.

అయితే ప్రస్తుతం రవితేజ- విశ్వక్ సేన్ ఎవరి సినిమాల్లో వాళ్ళు బిజీ గా ఉన్నారు. కాగా సందీప్ రాజ్ ఇటీవలనే రవితేజను కలిసి కథ వినిపించడానికి వెళ్లినట్టు సమాచారం.అలాగే సందీప్ చెప్పిన కథకు రవితేజ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే నిన్న సాయంత్రం డైరెక్టర్ సందీప్ రాజ్ బేబీ సినిమా సక్సెస్ అయినందుకు సాయి రాజేష్ ను విష్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అలాగే కొంత సేపటికి రవితేజ ఫోటో ఆయన వెనకాల ఉన్నఒక ప్రి రిలీజ్ ఈవెంట్ పిక్ ఒక దాన్ని పోస్ట్ చేయగా, వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నట్టు ఆయన పరోక్షంగా హింట్ ఇచ్చినట్టు స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఈగల్, టైగర్ నాగేశ్వర్ రావు సినిమాలు చేస్తున్న రవితేజ మరీ సందీప్ రాజ్ సినిమా ఎప్పుడు పట్టాలెక్కిస్తాడో చూడాలి.

- Advertisement -

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు