Rashmika Mandanna: నా మనసుకి నచ్చిన సినిమా అదే..!

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఛలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. తొలి సినిమాతోనే హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మకు వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి. ఇండస్ట్రీకి పరిచయమైన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వారిలో రష్మిక ఒకరు. ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఫిలిం బ్లాక్ బస్టర్, ఆ తర్వాత హిందీలో యానిమల్ హిట్ తర్వాత రష్మిక క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది.

ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప 2 సినిమాతో ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమా తర్వాత హిందీలో చావా, తమిళ్ లో ధనుష్ మూవీ, ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలు రష్మిక చేతిలో ఉన్నాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాను పుష్ప 1 కంటే పుష్ప 2 సినిమాకి ఎక్కువ కష్టపడ్డానని తెలిపింది. ఈ సినిమాలో శ్రీవల్లి 2.0 ని చూస్తారని చెప్పుకొచ్చింది.

అంతేకాదు ఇప్పటివరకు తాను నటించిన సినిమాలలో తనకి ఏ సినిమా బాగా ఇష్టమని అడగ్గా.. తన మనసుకి నచ్చిన సినిమా డియర్ కామ్రేడ్ అని తెలిపింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవచ్చు కానీ.. ఈ సినిమాలో తన పాత్ర, తన నటనకు ఎన్నో ప్రశంసలు వచ్చాయని తెలిపింది. తన అభిమానులకు సైతం ఈ పాత్ర ఎంతగానో నచ్చిందని.. అందుకే డియర్ కామ్రేడ్ సినిమా తన మనసుకి నచ్చిందంటూ చెప్పుకొచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు