Rashmika: రణబీర్‌తో లండన్‌కు వెళ్లిన నేషనల్ క్రష్.. దేనికంటే ?

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇప్పడిప్పుడే వరుస సినిమాలతో బిజీ అవుతుంది. ఇప్పటి వరకు అటు బాలీవుడ్ లో, ఇటు టాలీవుడ్ లో సరైనా అవకాశాలు లేక సతమతమైన రష్మిక సినీ కెరీర్ ముగిసినట్టే అని అందరూ అనుకున్నారు. ఇదే సమయంలో ఈమెపై వచ్చే ట్రోల్స్, రూమర్స్ కెరీర్ ను మరింత పతనం చేసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ముఖ్యంగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మధ్య ఉన్న వ్యవహారం గురించి కూడా అనేక వార్తలు వచ్చాయి. తమ మధ్య ఏం లేదని విజయ్, రష్మిక అనేక సార్లు వేరు వేరుగా ప్రకటన చేశారు. అయినా ఈ వార్తలకు బ్రేకులు పడలేదు. అంతే కాకుండా, ఇద్దరు ఒకే చోటుకు వేకేషన్ కు వెళ్లడం, విదేశాల్లో ఒకే చోటు ఉన్నట్లు ఫోటోలు వైరల్ కావడంతో విజయ్ దేవరొకండ, రష్మిక లవ్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారని వార్తలు తెగచక్కర్లు కొట్టాయి. ఇలా అనేక కారణాలతో సినిమా అవకాశాలు తగ్గుతూ వచ్చాయి.

అయితే తాజాగా రష్మిక మందన్నకు తెలుగు ఇండస్ట్రీలో ఓ ఛాన్స్ వచ్చింది. నితిన్ తో ఈ బ్యూటీ మరోసారి జతకొట్టబోతుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, రష్మిక ఇప్పటికే ఒకసారి భీష్మ అనే సినిమాలో ఆడిపాడన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే అదే వెంకీ కుడుముల దర్శకత్వంలో వీరు మళ్లీ కలిసి నటించబోతున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. దీంతో పాటు బాలీవుడ్ లో రణబీర్ కపూర్ తో యానిమల్ అనే సినిమా చేస్తుంది.

- Advertisement -

అయితే రణబీర్ కపూర్, రష్మిక తాజాగా లండన్ వెళ్లారు. యానిమల్ సినిమా షూటింగ్ లో భాగంగా వీరు లండన్ వెళ్లారని తెలుస్తోంది. గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో వస్తున్న యానిమల్ చిత్ర షూటింగ్ ఇండియాలో అయిపోయిందట. క్లైమాక్స్ ను లండన్ లో భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ మొదటి వారం నుంచి లండన్ షెడ్యూల్ ఉంటుందని మూవీ యూనిట్ కూడా ప్రకటించింది. అయితే ఏప్రిల్ మొదటి వారంలో షూటింగ్ ఉంటే.. 15 రోజుల ముందే వీళ్లు లండన్ కు ఎందుకు వెళ్లారు అంటూ నెటిజన్ల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు