Rashmika Mandanna: మరో వివాదంలో.

ఛలో సినిమతో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ బ్యూటీ రష్మిక మందన్నకు పట్టిందల్లా బంగారమే అయింది. ఈ చిత్రం తర్వాత గీతగోవిందం, భీష్మ, సరిలేరు నీకెవ్వరు వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో ఆమెను స్టార్ స్టేటస్ వరించింది. ఇక ఇటీవల వచ్చిన పుష్ప సినిమాతో రష్మిక క్రేజ్ ఎల్లలు దాటింది.

రష్మిక తాజాగా నటిస్తున్న హిందీ సినిమా ”మిషన్ మజ్ను”. సిద్ధార్ద్ మల్హోత్రా తో కలిసి నటిస్తున్న ఈ మూవీ థియేటర్లలో వస్తుందనుకున్న సినీ జనాలకు నిరాశే ఎదురయింది. మిషన్ మజ్ను డైరెక్ట్ గా ఓటీటి లోనే రిలీజ్ కానుంది. ఈ చిత్రం జనవరి 20న విడుదల కానుందని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చేస్తున్న ప్రమోషన్స్ ఈవెంట్స్ లో చురుకుగా పాల్గొంటుంది రష్మిక.

ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా స్టేజి మీద మాట్లాడుతూ మరోసారి తనను టార్గెట్ చేసే అవకాశం ఇచ్చింది. రొమాంటిక్ సాంగ్స్ అంటే బాలీవుడ్ మాత్రమేనని.. దక్షిణాదిలో ఎప్పుడూ మాస్ మసాలాలు, ఐటెం నెంబర్ లే ఉంటాయని చెప్పింది రష్మిక. అందుకే మొదటిసారి అలాంటి సాంగ్ చేస్తున్నందుకు తెగ ఎక్సైట్మెంట్ గా ఉందని ఓ రేంజ్ లో యాక్టింగ్ చేసి మరీ చెప్పింది.

- Advertisement -

రష్మిక చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం లో మెలోడీస్ రొమాంటిక్ పాటలే ఉండవు అన్న విధంగా చెప్పుకొచ్చింది. రష్మిక చేసిన ఈ కామెంట్స్ పై నెటిజెన్లు ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. సౌత్ సినిమాలలో నటించి పాపులర్ అయిన నువ్వు బాలీవుడ్ లో నాలుగు సినిమాలు చేయగానే ఇక్కడ సినిమాలని అవమానిస్తావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం ఏకంగా సౌత్ ఇండియా ఇండస్ట్రీ నుంచి రష్మికని బహిష్కరించాలని కొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ఇటీవల కాంతారా సినిమా చూడలేదని సమాధానం చెప్పి ఇలాంటి వ్యాఖ్యలతోనే కన్నడ ప్రజల ఆగ్రహానికి గురైన రష్మిక మందన , తాజాగా మరోసారి తన నోటి దురుసుతో మరో వివాదంలో చిక్కుకుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు