Kangana Ranaut: తునీషాది ఆత్మ హత్య కాదు

ప్రముఖ బాలీవుడ్ సీరియల్ నటి తునీషా శర్మ ఇటీవల ఊరి వేసుకుని చనిపోయిన విషయం తెలిసిందే. తునీషా నటిస్తున్న ”అలీ బాబా : దస్తాన్ ఇ కాబుల్” అనే సీరియల్ సెట్ లోని మేకప్ గదిలో ఉరివేసుకుంది. ఈమె మరణంతో బాలీవుడ్ మొత్తం ఉలిక్కిపడింది. షూటింగ్ సెట్ లోనే తునీషా విగత జీవిగా ఉండటంతో పలు అనుమానాలు వస్తున్నాయి. తునీషా ఆత్మహత్య చేసుకుందా? లేదా ఎవరైనా హత్య చేశారా? అనేది ఇప్పుడు బాలీవుడ్ లో పెద్ద ప్రశ్నగా మిగిలింది.

తునీషా తల్లి తన కూతురి మరణానాకి కారణం తునీషా మాజీ ప్రియుడు షీజన్ ఖానే కారణమంటూ ఆరోపించింది. అంతే కాదు పోలీసులకు కూడా అలాగే వాంగ్మూలం ఇచ్చింది. దీంతో తునీషా మాజీ ప్రియుడు షీజన్ ఖాన్ ను ముంబై పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ విచారణలో అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే తునీషాను తాను మాత్రం హత్య చేయాలేదని షీజన్ ఖాన్ చెబుతున్నారు.

ఈ కేసు విచారణ సమయంలో బాలీవుడు వివాదాస్పద నటి కంగనా రనౌత్ తునీషా మరణంపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తునీషాది ఆత్య హత్య కాదని, హత్య అని తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ వేసింది.

- Advertisement -

“ఒక స్త్రీ ప్రేమ, వివాహం, ప్రేమలో విఫలమైనా, వివాహా బంధంలో ఇబ్బందులు వచ్చినా ఎదుర్కోగలదు. కానీ ఒక స్త్రీకి నిజమైన ప్రేమ ఎప్పుడూ లభించడం లేదు. వారిని శారీరకంగా, మానసికంగా మరింత కుంగదీస్తున్నారు. వారికి ఎదురయ్యే అనుభవాలు వారి కలలు, ఊహలపై ప్రభావం చూపుతున్నాయి. ఆడపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ బాధ్యత ప్రభుత్వంపైన కూడా ఉంది. స్త్రీలకు భద్రతలేని భూమి వినాశనానికి గురవుతుంది. మహిళలపై యాసిడ్ దాడులు చేసే వారికి విచక్షణ లేకుండా మరణిశిక్ష విధించాలని తెలిపారు.

అంతే కాకుండా, చట్టపరమైన మోసాలను ఎలా పరిష్కరిస్తారో, ఆర్థికమోసాలను ఎలా డీల్ చేస్తారో…. అలాగే భావోద్వేగ మోసాలపై కూడా అధే విధంగా ప్రవర్తించాలి. రూమర్స్ చిన్నవే కదా అని కొట్టిపారేస్తారు. కానీ అవన్నీ అబద్ధాలు. అవి మనిషికి ఎంత నష్టాన్ని కలిగిస్తాయో వారికి మాత్రమే తెలుస్తుంది. కొందరికి పక్కవారి ఎమోషన్స్ ఫన్నీ గా అనిపిస్తాయి. కానీ అది సున్నిత మనసు ఉన్న వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి” అంటూ కంగన రనౌత్ ఎమోషనల్ గా పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు