Rashmika Mandanna: మళ్లీ రాజుకున్న వివాదం..

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. గత కొన్ని రోజులుగా ఎక్కువగా ట్రోల్స్ కు గురవుతున్న హీరోయిన్. రష్మిక ఎప్పుడైతే.. కాంతారపై వ్యాఖ్యలు చేసిందో.. అప్పటి నుంచి ఈ ట్రోల్స్ తారాస్థాయికి చేరుకున్నాయి. ఇది జరిగి చాలా రోజులే అవుతుంది. కానీ.. ఎప్పుడు ఎవరో ఒకరు దీన్ని తవ్వి తీయడం, దానిపై సోషల్ మీడియాలో చర్చలు జరగడం, ఈ క్రమంలో రష్మికపై ట్రోల్స్ రావడం.. ఇది గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్న సర్కిల్. అయితే న్యూ ఇయర్ నుంచి దీని ప్రస్తావన ఎక్కువగా రాలేదు.

ఎందుకంటే.. న్యూ ఇయర్ నుంచి రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ గురించే న్యూస్ వచ్చింది. దీంతో కాంతార వివాదం ముగిసిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ, తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు మళ్లీ వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చినట్టైంది. తనపై వస్తున్న ట్రోల్స్ పై స్పందిస్తూ.. “హీరోయిన్ అయితే అందరూ ఇష్టపడాలని ఏం లేదు. కొంత మంది ప్రేమిస్తారు. మరి కొందరూ ద్వేషిస్తారు. నేను ఓ పబ్లిక్ సెలబ్రిటీని. ఎప్పుడూ ప్రేక్షకులతోనే ఉంటాను. వారితోనే మాట్లాడుతుంటాను. ఇండస్ట్రీలో కొందరికి నా తీరు నచ్చి ఉండకపోవచ్చు. నేను మాట్లాడే మాటలు, నా ఎక్స్ ప్రెషన్స్ నచ్చకపోవచ్చు. దానికి ఎవరి కారణాలు వారికి ఉంటాయి. కానీ కొందరికి నేనంటే ప్రేమ ఉంటుంది కదా.. అలాంటి వారికి నేను కృతజ్ఞురాలిని” అంటూ చెప్పుకొచ్చింది.

అయితే ఈ ఇంటర్వ్యూ చివర్లో “కానీ కొందరికి నేనంటే ప్రేమ ఉంటుంది కదా.. అలాంటి వారికి నేను కృతజ్ఞురాలిని” అంటూ రష్మిక చేసిన కామెంట్ కాంతార హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి గురించే అని కన్నడ ప్రేక్షకులు అంటున్నారు. రిషబ్ శెట్టిపై సెటైర్ వేసేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. దీనిలో రిషబ్ శెట్టి ఫ్యాన్స్ కూడా ఎంట్రీ అవుతున్నారు. దీంతో ఈ వివాదం మళ్లీ అగ్గి రాజుకునే విధంగా ఉందని తెలుస్తోంది. మరి ఈ వ్యవహారం ఎక్కడ వరకు వెళ్తుందో చూడాలి.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు