Rashmika: బాలీవుడ్ నెట్టేసింది .. టాలీవుడ్ లో వచ్చి పడింది

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గత కొన్ని రోజుల నుంచి అనేక ఇబ్బందులను ఎదర్కొంటుంది. ఏం మాట్లాడినా, ఎక్కడికి వెళ్లినా అది వైరల్ అవుతుంది. ట్రోల్స్‌కు గురవుతుంది. ఇదే సమయంలో టాలీవుడ్ లో కూడా పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఈమె టాలీవుడ్ లో చివరిసారిగా ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలో కనిపించింది. ఇది సినీ విశ్లేషకుల నుంచి మిశ్రమ రివ్యూలను అందుకుంది. అలాగే కమర్షియల్ గా ఫెయిల్ రిజల్ట్ ను మూటగట్టుకుంది.

ఇక ఈ నేషనల్ క్రష్ బాలీవుడ్ లో సినిమాలు చేసినా, అవి హిట్ అనే మాటకు చాలా దూరంగా ఉంటున్నాయి. దీంతో అక్కడ కూడా రష్మికకు అవకాశాలు రావడం లేదు. దీంతో మళ్లీ అమె అడుగులు టాలీవుడ్ వైపునకు పడ్డాయని, సినిమా అవకాశాల కోసం ట్రై చేస్తోందని ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా రష్మిక ప్రయత్నాలు ఫలించాయి. టాలీవుడ్ లో రష్మిక ఓ క్రేజీ మూవీ ఛాన్స్ ను కొట్టేసింది.

యంగ్ హీరో నితిన్ తో రెండో సారి జతకట్టడానికి రెడీ అవుతుంది. నితిన్, రష్మిక మందన్న కాంబినేషన్ లో ఇప్పటికే భీష్మ అనే మూవీ వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ నితిన్, రష్మికలకు మంచి హిట్ అందించింది. దీని తర్వాత మళ్లీ ఈ జంట కలిసి నటించబోతున్నారు. ఈ మూవీకి భీష్మను తెరకెక్కించిన వెంకీ కుడుములనే దర్శకత్వం వహించబోతున్నాడు. అంటే భీష్మ టీం మళ్లీ కలిసి పని చేయబోతుంది అన్నమాట.

- Advertisement -

అయితే భీష్మను సితార ఎంటర్‌టైనన్‌మెంట్స్ నిర్మించగా, ఈ కాంబోలో వస్తున్న కొత్త మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్నారు. ఈ సినిమాపై అధికారిక ప్రకటన ఈ నెల 24న రానుందని తెలుస్తోంది. అలాగే మార్చి 30న నితిన్ పుట్టిన రోజు సందర్భంగా మూవీ నుంచి ఓ గ్లింప్స్ ను కూడా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు