టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం మెయిన్ లీడ్స్ గా వచ్చిన సినిమా రంగ మార్తాండ. మరాఠీ లో బ్లాక్ బస్టర్ అయిన నట సామ్రాట్ సినిమా కు ఇది రీమేక్. ఈ సినిమాకి తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేసి కృష్ణ వంశీ తెరకెక్కించాడు. మరాఠీ లో నానా పటేకర్ రోల్ ని తెలుగులో ప్రకాష్ రాజ్ చేసారు. ఇంకా శివాత్మిక, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ్ బాలకృష్ణ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. హౌస్ ఫుల్ మూవీస్ బ్యానర్ లో కాలిపు మధు ఈ సినిమా ని నిర్మించారు. సిరివెన్నెల పాటలు రాసిన ఆఖరి సినిమా ఇది.
మార్చి 22 న విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సినిమా చుసిన ప్రతి ఒక్కరిని కంట తడి పెట్టేలా చేసింది. ముఖ్యంగా బ్రహ్మానందం చాలా రోజుల తర్వాత నటనకి స్కోప్ ఉన్న క్యారెక్టర్ ని చేశారు. ఇతర ప్రధాన పాత్రలు చేసిన అనసూయ, ఆదర్శ్ వారి పరిధి మేరకు నటించారు. శివాత్మికా రాజశేఖర్ కి మంచి రోల్ ఈ సినిమా ద్వారా లభించింది. సినిమా పరంగా అద్భుతం అని క్రిటిక్స్ నుంచి ప్రశంసలు ఈ సినిమా థియేటర్స్ లో యావరేజ్ గా ఆడింది.
అయితే ఈ సినిమా లేటెస్ట్ గా ఓటీటీ ప్లాట్ పామ్ లో అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ పామ్ అయిన అమెజాన్ ప్రైమ్ లో “రంగ మార్తాండ” సినిమాను నిన్న అనగా ఏప్రిల్ 7 న విడుదల చేసారు. విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ సినిమా ఇండియా లో ట్రెండింగ్ లోకి వచ్చింది. ప్రస్తుతం ప్రైమ్ లో టాప్ 2 లో ట్రెండింగ్ అవుతుంది. థియేటర్ లో అంత గా ఆదరణకు నోచుకోని ఈ సినిమా ఓ టీ టీ లో మాత్రం ఇరగదీస్తోంది.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News