ఆదిపురుష్ సినిమా బాలీవుడ్ కి పెద్ద గుణ పాఠమే నేర్పించిందని చెప్పాలి. ఆదిపురుష్ సినిమాని ముందు నుంచి రామాయణం ఆధారంగా తీస్తున్నామని ప్రేక్షకుల నమ్మించిన మూవీ టీం, ఇప్పడు రిలీజ్ తరువాత ఆదిపురుష్ కి రామాయణంకి సంబంధం లేదంటూ చేతులెత్తేస్తున్నారు. కనీసం కూడా రామాయణ ఇతిహాసం మీద అవగాహనా లేకుండ తెరకెక్కించబడిన ఆదిపురుష్ సినిమా రిలీజ్ రోజు నుంచి వివాదాస్పదం అవుతూనే వచ్చింది.
అయితే ఆదిపురుష్ సినిమా రిలీజ్ ముందు మరో బాలీవుడ్ దర్శకుడు కూడా రామాయణాన్ని సినిమాగా తీస్తున్నడంటూ వార్తలు మొదలయ్యాయి. మరీ ఆ దర్శకుడు ఏమైనా ఓం రౌత్ లాగా ఒకటి, అరా సినిమాలు తీసిన దర్శకుడు ఐతే కాదు. దంగల్ లాంటి సూపర్ హిట్ సినిమా తీసిన నితీష్ తివారి. ఈయన దర్శకత్వంలో రియల్ లైఫ్ కపుల్ రణ్ బీర్ కపూర్ , అలియా భట్ జంటగా రామాయణం ఆధారంగా ఒక సినిమా ప్లానింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి లుక్ టెస్ట్ లు కూడా జరిగాయంట. డిసెంబర్ నుంచి ఈ సినిమా పనులు కూడా మొదలవబోతున్నాయి. అయితే అసలు సమస్య ఇక్కడే వచ్చి పడింది.
బాలీవుడ్ దర్శకులు, నటులు మోడరన్ కల్చర్ పేరుతో ఈ మధ్య కాలంలో వాళ్ళు తీస్తున్న సినిమాలు , సిరీస్ లు అందరు చూస్తూనే ఉన్నారు. ఎక్స్ పోజింగ్ , ఫ్యాన్సీ డాన్స్ లకు పెద్ద పీట వేస్తూ, కథ, కథనాన్ని పక్కన పడేయటం బాలీవుడ్ కి వెన్నతో పెట్టిన విద్య. అయితే నిన్న మొన్నటి వరకు ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీస్తూ పోయిన వీళ్ళు సడన్ గా ఇతిహాసాల మీద సినిమాలు ఎనౌన్స్ చేయడం అందరిలో భయాందోళనలను రేకెత్తిస్తుంది.
ఇప్పటికే ఆదిపురుష్ సినిమాతో రామాయణాన్ని అపహస్యం చేయగా,ఈ సినిమాని కూడా మళ్ళీ ఆదిపురుష్ లాగే తీసి చరిత్రను మార్చేస్తారేమో అని అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. దాంతో సోషల్ మీడియాలో యువత అంత మీరు ఏ సినిమాలైన తీయండి కానీ ఇతిహాసాల జోలికి మాత్రం రావద్దు అంటూ వాళ్ళ అభిప్రాయాలను పోస్ట్ ల రూపంలో తెలుపుతున్నారు. నితీష్ తివారి తీయబోయే రామాయణ్ సినిమా కూడా మరో ఆదిపురుష్ అవుతుందేమో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News