Ahimsa : రానా దగ్గుబాటితో తేజ సినిమా టైటిల్ ఇదే

విరాట పర్వం సినిమా తర్వాత బ్రేక్ తీసుకున్న రానా, లేటెస్ట్ గా తేజ దర్శకత్వంలో ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి సినిమా సూపర్ హిట్ అవ్వగా, మరోసారి వీరిద్దరి కలిసి సినిమా చేయడానికి కోలాబిరేట్ అవుతున్నారు.

అయితే నీదీ నాదీ ఒకే కథ సినిమాతో మంచి హిట్ ని అందుకున్న డైరెక్టర్ వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, విరాట పర్వం అనే సినిమా చేసారు. సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. నక్సల్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాపై రానా చాలా ఆశలు పెట్టుకున్నాడు. మంచి కథ, కథనంతో తెరకెక్కిన ఈ సినిమాకి విమర్శకుల ప్రశంశలు దక్కాయి, కానీ కమర్షియల్ గా సినిమా ఆశించినంత విజయం దక్కలేదు. దాంతో రానా కాస్త బ్రేక్ తీసుకున్నారు. అంతలోనే వెంకటేష్, రానా కాంబినేషన్ లో నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన రానా నాయుడు సిరీస్ రిలీజై, వివాదస్పదమైంది.

ఆ తరువాత రానా ఈ సిరీస్ కి సీజన్ 2చేయవలసి ఉంది, కానీ వివాదాల దృష్ట్యా ప్రస్తుతం రానా నాయుడు సిరీస్ కి బ్రేక్ ఇచ్చి, డైరెక్టర్ తేజ తో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. అయితే తేజ రానా తమ్ముడు అభిరామ్ ని హీరోగా పరిచయం చేస్తూ, అహింస అనే సినిమా తీశారు జూన్2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో ఉన్న తేజ, సినిమా రిలీజ్ తరువాత రానా సినిమాకి సంబందించిన పనుల్లో బిజీ అవ్వనున్నారు. అయితే ఈ సినిమాకి రాక్షస రాజు అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. పొలిటికల్ త్రిల్లర్ గా ఈ సినిమా ఉండబోతుందని టాక్. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి సినిమా కూడా పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కి మంచి విజయాన్ని సాధించగా, మళ్ళీ అదే జానర్ లో సినిమాని తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తొందరలోనే ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రానుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు