ప్రముఖ నటి రమ్యకృష్ణ గురించి తెలియని వారు ఉండరు. ఆమె దేశవ్యాప్తంగా అందరికీ పరిచయమే. ఆమె 50 సంవత్సరాల వయస్సు వచ్చినప్పటికీ సినిమాల్లో నటిస్తూ అభిమానులను ఆకర్షిస్తోంది. రమ్యకృష్ణ 1970, సెప్టెంబర్ 15న మద్రాస్లో పుట్టారు. మొదటి నుంచే ఈమెకు గ్లామర్ ఫీల్డ్లో రాణించాలనే అభిలాష ఉండేది. ఆమె తల్లి కూడా ఆమెను చిన్నప్పటి నుంచే ప్రోత్సహించారు.
ఆమె మొదటి సారి మమ్ముట్టి, మోహన్ లాల్ నటించిన నేరమ్ పులరుంబోల్ అనే మళయాళ సినిమాలో నటించింది. ఇక తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా రూపొందించిన కండుకాగడా చిత్రంలో ఒక చిన్న పాత్రను పోషించారు. ఇక ఆ తరువాత కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో మోహన్బాబు నిర్మించి, నటించిన అల్లుడు గారు చిత్రం ఆమెకు మంచి విజయం లభించింది. ఇక అప్పటి నుంచి నిర్మాతలు వరసగా ఆమెకు ఆఫర్లు ఇచ్చారు.
ముఖ్యంగా అల్లరి మొగుడు, అల్లరి ప్రియుడు, మేజర్ చంద్రకాంత్, ముద్దుల ప్రియుడు, ముగ్గురు మొనగాళ్లు, అన్నమయ్య, అల్లుడా మజాకా, బంగారు బుల్లోడు, వంశానికొక్కడు, హల్ బ్రదర్ వంటి చిత్రాల్లో రమ్యకృష్ణ తన అందాలతో మురిపించారు. ఇక ఆ తరువాత దాసరి నారాయణరావు కంటే కూతుర్నే కనాలి చిత్రం నటిగా మంచి గుర్తింపునే తీసుకొచ్చింది. రమ్యకృష్ణకి అందాల పాత్రతో పాటు అభినయ ప్రాధాన్యత ఉన్న పాత్రలు కూడా లభించాయి.
జూనియర్ ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమాలో రమ్యకృష్ణ ఓ ఐటమ్ సాంగ్ లో నటించారు. అదేవిధంగా ప్రభాస్ నటించిన అడవి రాముడు చిత్రంలో కూడా ఐటమ్ సాంగ్ లో నటించింది. ఎన్టీఆర్ నటించిన నా అల్లుడు చిత్రంలో అత్తగా తమ పాత్రను అదుర్స్ అనిపించింది. ఇక అప్పటి వరకు నటించిన పాత్రలు ఒక ఎత్తు.. బాహుబలి చిత్రంలో నటించిన తీరు మరో ఎత్తు. ప్రస్తుతం రమ్యకృష్ణ డ్యాన్స్ ఐకాన్ పేరుతో నిర్వహించబోతున్న షోకు జడ్జీగా వ్యవహరిస్తున్నారు. ఇవాళ రమ్యకృష్ణ పుట్టిన రోజు సంధర్బంగా filmify తరుపున రమ్యకృష్ణకి జన్మదిన శుభాకాంక్షలు.