Kasturi Shankar.. టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికీ ఎన్నో చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను బాగా అలరిస్తోంది హీరోయిన్ జ్యోతిక.. తన కెరియర్ లో ఎప్పుడూ కూడా విభిన్నమైన పాత్రలలోనే నటిస్తూ మెప్పించింది. సాధారణంగా జ్యోతిక ఎలాంటి కాంట్రవర్సీలకు స్థానం ఇవ్వదు. ఎక్కువగా కుటుంబ బాధ్యతలు , పిల్లల విషయాలు తప్ప బయట విషయాల పైన ఎప్పుడు మాట్లాడడం జరగదు.. ఎప్పుడూ తన భర్త సూర్య.. తను మాత్రమే ఎక్కువగా పిల్లలతో కనిపిస్తూ ఉంటారు.. కుటుంబం, సినిమా తప్ప వేరే ప్రపంచమే తెలియని తనను ప్రముఖ నటి కస్తూరి శంకర్ ఊహించని కామెంట్స్ చేయడంతో జ్యోతిక కాస్త ఇబ్బంది పడినట్టు తెలుస్తోంది . ఈ విషయాన్ని తాజాగా ఆమె వెల్లడించడం గమనార్హం.
ఓటు వేయలేకపోయినా జ్యోతిక..
అయితే ఇటీవలి ఒక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జ్యోతిక మాట్లాడుతూ.. ఓటు వేయడం గురించి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు తీవ్రదుమారాన్ని రేపేలా చేస్తున్నాయి.. ఇటీవల తమిళనాడులోని పార్లమెంటు ఎన్నికలు జరిగాయి.. ఇందులో చాలామంది సెలబ్రిటీలు కూడా తమ ఓటు హక్కును సైతం వినియోగించుకున్నారు. జ్యోతిక భర్త సూర్య, ఆయన తమ్ముడు కార్తీ ఇద్దరు కూడా ఈ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. అయితే నటి జ్యోతిక మాత్రం ఓటు హక్కును వినియోగించుకోలేదనే విషయం పైన రిపోర్టర్ అడగగా పలు విషయాలను తెలిపింది.
ఆన్లైన్లో ఓటు వేసాను అంటున్న జ్యోతిక..
ఈ విషయం పైన జ్యోతిక మాట్లాడుతూ.. తాను ఆన్లైన్లో కొన్నిసార్లు ఓటు వేశానని ..అలా ఎన్నోసార్లు ఓటు వేస్తూనే ఉన్నానని.. కొన్నిసార్లు ఓటు వేయడానికి అందుబాటులో లేకపోవడం వల్లనే వేయలేకపోయానని తెలిపింది జ్యోతిక.మొత్తానికి జ్యోతిక తమకంటూ కాస్త ప్రైవేటు జీవితం ఉందని వాటి పనులలో బిజీగా ఉండడం వల్లే ఇలాంటి ఓటు హక్కును వినియోగించుకోలేకపోయాను అన్నట్లుగా సమాధానాన్ని తెలిపింది. అయితే ఈ వాక్యాల పైన పలువురు నెటిజన్స్ కూడా పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
జ్యోతిక కామెంట్స్ కి కస్తూరి శంకర్ చెక్..
ముఖ్యంగా జ్యోతిక చేసినటువంటి ఆన్లైన్ ఓటింగ్ కామెంట్స్.. తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఇలాంటి ఓటింగ్ ఎప్పుడు చూడలేదని కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ విషయం పైన నటి కస్తూరి శంకర్ కూడా స్పందించింది.. మాలాంటి వారందరూ ఎండలో నిలబడి మరీ ఆరోజు ఓటు వేసాము.. ముఖ్యంగా ఇతర దేశాలకు వెళ్లేటువంటి వారు కూడా ఫ్లైట్ టికెట్లను బుక్ చేసుకొని మరీ క్యాన్సిల్ చేసుకుని ఓటు వేశామంటూ తెలియజేయడం జరిగింది కస్తూరి శంకర్.. అయితే పలువురు నెటిజెన్స్ ఇది జ్యోతికకి కస్తూరి శంకర్ అదిరిపోయే కౌంటర్ వేసినట్లుగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. అయితే ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాలి. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఓటు వేయలేదు అంటూ జ్యోతిక కామెంట్లు చేయడంతో దీనికి దీటుగా కస్తూరి శంకర్ కామెంట్ చేయడం గంగనారో మొత్తానికైతే ఈ ఓటు అని అంశంతో వీరిద్దరూ మళ్ళీ వార్తల్లో నిలిచారు దీనిపై జ్యోతిక మరే విధంగా స్పందిస్తుందో చూడాలి.
Ms Jyotika on why she didn’t vote:
‘Sometimes we are not in town’.
‘We have a private life’
‘Online voting is there, not everything is publicised’Meanwhile we- who waited in the sun all day to vote..😠
And me – who paid to change date on USA flight to after election..😭 pic.twitter.com/JZTCDVF5KO— Kasturi (@KasthuriShankar) May 4, 2024