Saipallavi : రెమ్యునరేషన్ భారీగా అడుగుతున్న సాయిపల్లవి ?

Ramayana Sai Pallavi getting paid more than Rs 50 cr: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ అందులో కొంతమంది మాత్రమే పాపులర్ అవుతూ ఉంటారు. కొంతమంది అట్టర్ ఫ్లాప్ అవుతూ ఉంటారు. ఇక మరికొంతమంది పడుతూ లేస్తూ ఉంటారు. ముఖ్యంగా మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్ల కంటే ఇతర భాషల నుంచి వచ్చిన హీరోయిన్లు మాత్రమే ఎక్కువగా ఉంటారు. దీనికి చాలా కారణాలే ఉన్నాయి.

ఇతర భాషల నుంచి వచ్చిన హీరోయిన్లు ఎక్స్పోజింగ్ బాగా చేస్తారు. అదే తెలుగు హీరోయిన్లు మాత్రం… ఎక్స్పోజింగ్ చేయడానికి ఈ కాస్త వెనుక ఆడుతారు. కానీ కొంతమంది హీరోయిన్లు ఎక్కడి నుంచి వచ్చిన తమ టాలెంట్ తో టాప్ మోస్ట్ హీరోయిన్గా అవతరిస్తారు. అలాంటి హీరోయిన్లలో నెంబర్ వన్ పొజిషన్లో సాయి పల్లవి ఉంటారు. హీరోయిన్ సాయి పల్లవి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నాచురల్ బ్యూటీ సాయి పల్లవి తన అందం, అభినయం తో అందర్నీ ఆకట్టుకుంది.

వాస్తవానికి సాయి పల్లవిది తమిళనాడు రాష్ట్రంలోని కోటగిరి. అంటే ఈ పిల్ల తమిళనాడు రాష్ట్రానికి చెందినది అన్నమాట. కానీ మన తెలుగు ఇండస్ట్రీలో ఏమని మించిన హీరోయిన్ ఎవరూ లేరని చెప్పవచ్చు. డాన్స్, యాక్టింగ్ అలాగే డైలాగ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతాలు సృష్టించింది… హీరోయిన్ సాయి పల్లవి. అయితే 2005 సంవత్సరంలో కస్తూరి మాన్ అనే సినిమాలో కాలేజీ అమ్మాయి పాత్రలో మెరిసింది ఈ బ్యూటీ. తమిళంలో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

- Advertisement -

ఆ తర్వాత కొన్ని సినిమాలలో నటించింది ఈ బ్యూటీ. 2015 సంవత్సరంలో మలయాళం లో వచ్చిన ప్రేమం సినిమాలో నటించి మెప్పించింది సాయి పల్లవి. ఇక మన తెలుగులో ఫిదా సినిమాతో భానుమతి పాత్ర చేసి బాంబు పేల్చింది సాయి పల్లవి. 2017 సంవత్సరంలో వచ్చిన ఫిదా సినిమా బంపర్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత మిడిల్ క్లాస్ అబ్బాయి, పడి పడి లేచే మనసు, కణం, లవ్ స్టోరీ, శ్యామ్ సింగారాయి, విరాట పర్వం లాంటి ఎన్నో బ్రహ్మాండమైన సినిమాలు చేసింది సాయి పల్లవి.

అయితే ఇన్ని సినిమాలు చేసిన సాయి పల్లవి ఎక్కడ కూడా ఎక్స్పోజింగ్ చేయలేదు. ఆమె లేడీ పవర్ స్టార్ గా పేరు కూడా తెచ్చుకున్నారు. ఈమె సినిమా చేసింది అంటే హీరో పాత్ర కూడా పనికిరాదు. అంతలా ఉంటుంది హీరోయిన్ సాయి పల్లవి పాత్ర ప్రభావం. అయితే ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో రామాయణ సినిమాలో సాయి పల్లవి నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ అలాగే యష్ కీలక పాత్రలో ఈ సినిమా వస్తోంది. దీనికి నితీష్టి వారి దర్శకత్వం వహిస్తున్నాడు.

అయితే ప్రస్తుతానికి సాయి పల్లవి రెండు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటోంది ప్రతి సినిమాకు..! కానీ రామాయణ సినిమాకు భారీగా రెమ్యూనరేషన్ అడుగుతోందట సాయి పల్లవి. బాలీవుడ్ సినిమా కావడంతో ఈ సినిమాకు భారీగా డిమాండ్ చేస్తుందట. అలాగే ఈ సినిమా మూడు భాగాలుగా చేస్తున్నారట. అందుకే ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా 50 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారట సాయిపల్లవి. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు