Prabhas : ఒకే ఏడాది మూడు సినిమాలు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాప్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ప్రాజెక్ట్ కే. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మాణంలో వస్తుంది. బాలీవుడ్ భామలు దీపికా పదుకొణె, దిశా పటాని హీరోయిన్లు గా నటిస్తున్నారు. అలాగే బిగ్ బి ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రాజెక్ట్ కే సుమారుగా 500 కోట్ల బడ్జెట్ తో రూపొందుతుంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్, నిర్మాత అశ్విని దత్ ఈ సినిమాను ప్రాతిష్టాత్మకంగా తీసుకున్నారు. పాన్ వరల్డ్ గా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుండి ఒక బిగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. నిర్మాత అశ్విని దత్ ఒక ఇంటర్వ్యూలో ప్రాజెక్ట్ కే రిలీజ్ డేట్ చెప్పేశాడు. వచ్చే సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలలో షూటింగ్ పూర్తి చేస్తామని తెలిపాడు. దీని తర్వాత ఏడు నుంచి ఎనిమిది నెలల పాటు పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటాయని వెల్లడించాడు. మొత్తంగా సినిమాను అక్టోబర్ 18న విడుదల చేస్తామని ప్రకటించాడు. ఒక వేళ అక్టోబర్ 18న వీలు కాకుంటే, 2024 సంక్రాంతి బరిలో ఉంచుతామని తెలిపాడు.

కాగ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ వచ్చే సంవత్సరం విడుదల కాబోతుంది. 2023 సంక్రాంతి బరిలో ఉంటుందని అవుతుందని అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అలాగే వచ్చే సంవత్సరమే ప్రభాస్ హీరోగా, కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ వస్తుంది. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా సలార్ రానుంది. అంటే వచ్చే ఏడాది ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగనే ఉంటుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు