Samyuktha Menon : ‘ఆ వార్తల్లో నిజం లేదు’

సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ ను కూడా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇటీవలే పూర్తి చేశాడు. నిర్మాతల మండలి ఆందోళన తగ్గితే ఆగస్టు రెండో వారంలో షూటింగ్ ప్రారంభమవుతుందని టాక్. SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో మూవీ యూనిట్ సినిమా పనులను చేసుకుంటుంది.

SSMB28లో మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. అలాగే రెండో హీరోయిన్ గా సంయుక్త మీనన్ ఎంపిక అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. సంయుక్త మీనన్ ను డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒప్పించాడని సమాచారం వచ్చింది. సంయుక్త మీనన్ దీనికి ముందు త్రివిక్రమ్ పర్యవేక్షణలో వచ్చిన భీమ్లా నాయక్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

భీమ్లా నాయక్ సినిమా సమయంలోనే సంయుక్త మీనన్ కు SSMB28 గురించి చెప్పాడని, దానికి సంయుక్త కూడా ఒప్పుకుందాని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై సంయుక్త మీనన్ స్పందించింది. తాను SSMB28 లో హీరోయిన్ గా నటించడం లేదని స్పష్టం చేసింది. ఈ సినిమాలో నటించాలని నిర్మాతలు కానీ, డైరెక్టర్ కానీ తనను సంప్రదించలేరని క్లారిటీ ఇచ్చింది. సంయుక్త మీనన్ ఇచ్చిన క్లారిటీతో ఇప్పటి వరకు వచ్చిన వార్తలకు బ్రేక్ పడింది. కాగ సంయుక్త మీనన్ తాజాగా కళ్యాణ్ రామ్ తో నటించిన బింబిసార వచ్చే నెల 5వ తేదీన విడుదల కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు