Adipurush : అయోధ్య అందుకే..

పాన్ ఇండియా సెన్సేషన్ యంగ్ రెబెల్ స్టార్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీస్ లో “ఆది పురుష్” సినిమాపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ముందు నుంచి భారీ అంచనాలతో ప్రేక్షకులలో మంచి క్రేజ్ ఏర్పరుచుకుంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కృతిసనన్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ చిత్ర నిర్మాణంలో యూవీ క్రియేషన్స్ నుంచి వంశీ, ప్రమోద్ భాగస్వామ్యులుగా వ్యవహరిస్తున్నారు. సుమారు 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆదివారం సరయూ నది తీరాన శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్య నగరంలో ఈ చిత్ర టీజర్ విడుదల వేదికను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ప్రభాస్, కృతి సనన్, దర్శకుడు ఓమ్ రౌత్ తో పాటు ఇతర చిత్ర బృందం పాల్గొన్నారు. ఈ వేడుకలో సినిమా అఫీషియల్ లుక్ ని, టీజర్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు. టీ టీజర్ లో ప్రభాస్ లుక్ పై కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ టీజర్ విడుదల సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ.. శ్రీరాముడి ఆశీస్సులు తీసుకునేందుకు అయోధ్య నగరానికి వచ్చామని అన్నారు. మొదట ఈ పాత్రలో నటించేందుకు తాను భయపడ్డానని.. ప్రాజెక్ట్ అనుకున్న మూడు రోజుల తర్వాత దర్శకుడు ఓంరౌత్ తనకి ఫోన్ చేసి ఈ పాత్రలో మెప్పించేలా ఎలా నటించాలి అనే దానిపై మాట్లాడుకుందామని తెలిపారని అన్నారు. ప్రేమ, భయ, భక్తులతో ఈ సినిమాను రూపొందించామని తెలిపారు. ఆ శ్రీరాముడి కృప మాపై ఉంటుందని విశ్వసిస్తున్నామని అన్నారు ప్రభాస్. నవరాత్రుల వేడుకలలో భాగంగా అయోధ్యలో ఈ టీజర్ ని విడుదల చేయడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు