UBS : పవన్ కళ్యాణ్ తో స్టెప్స్ వేయనున్న పూజా హెగ్డే

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న పూజా హెగ్డే గత కొద్దీ కాలంగా టాలీవుడ్ కి దూరంగా ఉంటుంది. ఈ మధ్య తెలుగులో ఆమె చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతూ వస్తుండటంతో ఈ బ్యూటీని తెలుగు దర్శకులు, హీరోలు పక్కన పెట్టేస్తున్నారు. దానికి తోడు పూజా హెగ్డే కూడా బాలీవుడ్ సినిమాలపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తుండటంతో తెలుగు సినిమాలకి ఈమె బ్రేక్ ఇచ్చినట్టు తెల్సుతుంది.

దాదాపు సౌత్ ఫిలిం ఇండస్ట్రీ లో ఉండే స్టార్ హీరోయిన్స్ గా చెలామణిలో ఉన్న వాళ్లలో ఎక్కువ మంది ముంబై , ఢిల్లీ కి చెందిన వాళ్ళు కావడంతో, ఎంతసేపు వాళ్ళ దృష్టి అంత బాలీవుడ్ పైనే ఉంటుంది. తెలుగు, తమిళ్ ఇతర భాషల్లో వీళ్ళు నటించే సినిమాలన్నీ అల్టిమేట్ గా బాలీవుడ్ దృష్టిలో పడాలనే చేస్తుంటారు. అయితే ఇది కొంత మందికి వర్క్ అవుట్ అవుతుంది. కానీ కొంతమందికి అస్సలు వర్క్ అవుట్ అవకుండా కెరీర్ ఇరకాటంలో పడిపోతుంది. ఇప్పుడు పూజా హెగ్డే పరిస్థితి కూడా ఇలాగె ఉంది.

టాలీవుడ్ లో వరుస చేస్తూ బిజీగా ఉండే ఈ బ్యూటీ ఇటీవలనే బాలీవుడ్ సినిమాలకు కూడా ఒకే చెప్తూ వచ్చింది. గతంలో హృతిక్ రోషన్ మొహంజొదారో సినిమాలో నటించిన ఈమె, ఇటీవలనే రణ్ వీర్ సింగ్ తో సర్కస్ , సల్మాన్ ఖాన్ తో కిసీకా భాయ్ కిసీకి జాన్ సినిమాలో నటించింది.

- Advertisement -

అయితే ఈ రెండు సినిమాలు కూడా ఆశించినంత విజయం సాధించకపోయేసరికి మళ్ళీ ఈ బ్యూటీ కన్ను సౌత్ సినిమాల వైపు పడింది. ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో తెలుగులో మహేష్ హీరోగా వస్తోన్న గుంటూరు కారం సినిమా తప్ప చేతిలో చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేకపోవటంతో ఐటెం సాంగ్స్ అయిన కూడా ఒకే చెబుతున్నట్టు తెల్సుతోంది.

పవన్ కళ్యాణ్ హీరోగా మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఐటెం సాంగ్ కి గాను పూజా హెగ్డే ని అడగగా, ఆమె ఒకే చెప్పినట్టు సమాచారం. గతంలో కూడా ఈమె రంగస్థలం , F3 సినిమాలలో ఐటెం సాంగ్స్ లో స్టెప్స్ వేయగా అవి సూపర్ హిట్ అయ్యాయి. దాంతో అదే సెంటిమెంట్ ఈ సినిమాకి వర్క్ అవుట్ అవుతుందని హరీష్ శంకర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు టాక్.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు