Pooja Hegde: సినిమాలు ఫ్లాప్ అయిన కెరీర్ కి మాత్రం ఢోకా లేదు

గత కొద్దీ రోజులుగా సోషల్ మీడియాలో పూజా హెగ్డే గురించిన పలు రకాల న్యూస్ లు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఆమె చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతుండటంతో అవకాశాలేవీ రావట్లేదని, ప్రస్తుతం ఆమె చేతిలో సినిమాలేవీ లేవని. ఇక పూజా హెగ్డే కెరీర్ ముగిసినట్టే అని రోజు వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ వార్తలు కేవలం ఇంటర్నెట్ కు మాత్రమే పరిమితం అయ్యాయి. రియాలిటీలో పరిస్థితి వేరుగా ఉంది.

నాగ చైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైన పూజా హెగ్డే, మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా తరువాత వరుణ్ తేజ్ సరసన ముకుంద సినిమాలో నటించిన పూజా , అల్లు అర్జున్ హీరోగా వచ్చిన దువ్వాడ జగన్నాథం సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక ఆ తరువాత నుంచి వరుస స్టార్ హీరోల సినిమాలతో సౌత్ ఫిలిం ఇండస్ట్రీలలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా హల్చల్ చేసింది.

అయితే ఇటీవల కాలంలో పూజా హెగ్డే నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతూ వస్తుండటంతో తెలుగులో ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గాయి. దాంతో పూజా హెగ్డే బాలీవుడ్ సినిమాపై ఫోకస్ పెట్టింది. రణ్ వీర్ సింగ్ , సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశం ఐతే వచ్చింది కానీ సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించినంత విజయాన్ని సాధించలేకపోయాయి. దాంతో పూజా హెగ్డే పై ఐరన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది. పూజా హెగ్డే హీరోయిన్ గా ఉంటె సినిమా ఫ్లాప్ అనే సెంటిమెంట్ వచ్చింది. అయిన కూడా ఈ బ్యూటీకి ఆఫర్స్ మాత్రం తగ్గట్లేదు.

- Advertisement -

ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న ఈమె, శర్వానంద్ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మరో సినిమా చేస్తుంది. అంతే కాదు బాలీవుడ్ లోను షాహిద్ కపూర్ హీరోగా రాబోతున్న సినిమాలో పూజా హెగ్డే నే హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాలతో పాటు యాడ్స్ లో కూడా నటిస్తూ బిజీ గా ఉంటోంది. ఇటీవలనే పూజా హెగ్డే అమితాబ్ బచ్చన్ తో కలిసి ఒక యాడ్ లో నటిస్తూ, ఆయనతో దిగిన ఒక ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు