Aadi: రీ రిలీజ్ మూవీస్ ట్రెండ్ లో ఇప్పుడిక ఎన్టీఆర్ వంతు

టాలీవుడ్ లో గత కొన్ని నెలలుగా రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. పోకిరితో మొదలైన ఈ ట్రెండ్ ఖుషి సినిమా తో పీక్స్ కి చేరింది. మాములుగా రీ రిలీజ్ సినిమాలు అంటే ఆయా హీరోల బ్లాక్ బస్టర్ విడుదల అవుతాయి. అయితే ఈ మధ్య విడుదలైన ఆరెంజ్ అనే ప్లాప్ సినిమా కూడా కోట్లు వసూలు చేసింది. తెలుగులో ఇప్పటివరకు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్, బాలకృష్ణ, చిరంజీవి, సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. ఇక అల్లు అర్జున్ సినిమా దేశ ముదురు కూడా ఏప్రిల్ 6 న రీ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఎన్టీఆర్ వంతు వచ్చింది.

ఎన్టీఆర్ నటించిన “ఆది” సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2002 లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నందమూరి ఫ్యామిలీ నుంచి మరో స్టార్ హీరో వచ్చాడని ఈ సినిమాతో ఇండస్ట్రీకి తెలిసింది. ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా అప్పటి టాప్ హీరోలకు జలక్ ఇచ్చి భారీ వసూళ్లు సాధించింది. 96 సెంటర్లలో వంద రోజులాడిన ఈ సినిమా 18 కోట్లకు పైగా వసూలు చేసి టాప్ 3 గ్రాసర్ గా నిలిచింది.

అయితే ఇప్పుడు ఈ సినిమా 2023 మే 20 న ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా మళ్ళీ విడుదల అవుతుంది. ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ మరో సినిమా చేయలేదు. కొరటాల శివ దర్శకత్వం లో ఎన్టీఆర్30 చేస్తున్నా, ఆ సినిమా 2024 లో విడుదల అవుతుంది. కాబట్టి ఆది సినిమా రీ రిలీజ్ తారక్ అభిమానులకి గుడ్ న్యూస్ గా చెప్పవచ్చు. ముందుగా సింహాద్రి రీ రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం సింహాద్రి సినిమాను క్యాన్సిల్ చేసి ఆది ని విడుదల చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన సినిమాల్లో మంచి కలెక్షన్లు వసూలు చేసిన సినిమాలు ఖుషి, ఒక్కడు, ఆరెంజ్, పోకిరి మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఇప్పుడు ఆది సినిమా రీ రిలీజ్ అయ్యి ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు