Jr NTR Watch Price : ఎన్టీఆర్ ధరించిన ఈ వాచ్ ఖరీదు ఎంతో తెలుసా..?

Jr NTR Watch Price : టాలీవుడ్ లో ప్రత్యేకించి నందమూరి హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ కి వున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎప్పుడూ కూడా విభిన్నమైన పాత్రలలో నటిస్తూ.. అద్భుతమైన కథలతో ప్రేక్షకులను అబ్బుర పరుస్తూ ఉంటారు ఎన్టీఆర్..ఇదిలా వుండగా రాజమౌళి దర్శకత్వంలో 2022 లో RRR చిత్రంలో కొమరం భీం పాత్రలో అద్భుతంగా నటించారు ఎన్టీఆర్. దీంతో గ్లోబల్ స్టార్ గా,పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. ప్రస్తుతం డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవల్ లో తీస్తున్నారు.

టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ లో ఎన్టీఆర్..

ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఎన్టీఆర్ ఇటీవలే టిల్లు స్క్వేర్ సినిమా సక్సెస్ ఈవెంట్ కి గెస్ట్ గా రావడం జరిగింది.. ఈ చిత్రంలో హీరోగా సిద్దు జొన్నలగడ్డ నటించగా.. హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది.అతి తక్కువ సమయంలోనే రూ.100 కోట్ల మార్కుని క్రాస్ చేసిన సినిమాగా నిలిచింది. దీంతో హైదరాబాద్ లో ఈ సినిమా సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేశారు చిత్ర బృందం ఇందుకు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే అక్కడ ఆ ఈవెంట్ లో ఎన్టీఆర్ చాలా సింపుల్ గా ఫార్మల్ దుస్తులలో కనిపించారు.

వాచ్ ధర తెలిస్తే షాక్..

అయితే ఎన్టీఆర్ ధరించిన దుస్తులు చాలా సింపుల్ గా వున్నప్పటికీ ఎన్టీఆర్ పెట్టుకున్నటువంటి వాచ్ మాత్రం చాలా అట్రాక్షన్ గా కనిపించింది.. అయితే ఎన్టీఆర్ అభిమానులు మాత్రం తమ హీరో పెట్టుకున్నటువంటి వాచ్ ధర ఎంత ఉంటుందా అని గూగుల్లో తెగ వెతికేస్తున్నారు.. ఇక తాజాగా అందిన సమాచారం ప్రకారం Audemars piguet oak offshore మోడల్ వాచ్ అన్నట్లుగా తెలుస్తోంది.. అయితే దీని ధర అక్షరాలా రూ. 1,62,32,657 అన్నట్లు సమాచారం.. ఈ వాచ్ ధర తెలిసి అభిమానులందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
Jr NTR Watch Price
Jr NTR Watch Price

దేవర మూవీ ఎన్టీఆర్ కామెంట్స్..

దేవర సినిమా విషయానికి వస్తే.. టిల్లు స్క్వేర్ సక్సెస్ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ .. కాలర్ ఎగరేసుకునేలా సినిమా ఉంటుందని చెబుతూ.. అభిమానులలో అంచనాలు అమాంతం పెంచేశారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. మొదటి భాగాన్ని దసరా కానుకగా అక్టోబర్ 10 న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న ప్రాజెక్టు కావడంతో నిర్మాత కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో శృతి మరాఠీ , జాన్వీ కపూర్ హీరోయిన్లుగా నటిస్తూ ఉండగా నటించబోతున్నారు.. ఇక ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఇప్పుడు భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా మరి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు