NTR – Trivikram : ఇన్ని పాన్ ఇండియా సినిమాలు ఉంటే ఎన్టీఆర్ కే గురూజీ సపోర్ట్ ఎందుకు?

NTR – Trivikram : రీసెంట్ గా జరిగిన టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిన విషయం తెలిసిందే. వేదికపై త్రివిక్రమ్ హీరో ఎన్టీఆర్ కు చేసిన సపోర్ట్ చర్చనీయాంశంగా మారింది. గురూజీ ఏకంగా దేవర 1000 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టాలని ఆశీర్వదిస్తూనే, ఉగాది నుంచి ఈ ఏడాదిని దేవర నామ సంవత్సరంగా ప్రకటించారు. మరి టాలీవుడ్ లో ఇంత మంది పాన్ ఇండియా స్టార్స్ ఉండగా దేవరకే గురూజీ ఎందుకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు? అనే ఇంట్రెస్టింగ్ విషయంలోకి వెళ్తే…

ఎన్టీఆర్ కే త్రివిక్రమ్ సపోర్ట్ ఎందుకంటే?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే ప్లాన్ ఇండియా మూవీని చేస్తున్న విషయం తెలిసిందే. టాలెంట్ ఉన్న యంగ్ స్టార్స్ ను సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ కు ఎన్టీఆర్ గెస్ట్ గా హాజరయ్యారు. ఇక అదే వేడుకకు ఆ సినిమా నిర్మాణంలో భాగమైన స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో అతిథిగా విచ్చేశారు. ఇదే స్టేజ్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దేవరకు తన ఫుల్ సపోర్ట్ ను ప్రకటించారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎంతోమంది పాన్ ఇండియా స్టార్స్ ఉండగా గురూజీ సపోర్ట్ ఎన్టీఆర్ కు మాత్రమే ఎందుకు? అనే ప్రశ్న మెదులుతోంది చాలామంది మదిలో. దీనికి సమాధానంగా త్వరలోనే గురూజీ, ఎన్టీఆర్ కాంబోలో ఓ పాన్ ఇండియా మూవీ పట్టాలెక్కే ఛాన్స్ ఉందనీ, అందుకే టిల్లు స్క్వేర్ వేదికపై దేవరను త్రివిక్రమ్ పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేసాడని ప్రచారం జరుగుతోంది.

గురూజీ, ఎన్టీఆర్ మధ్య గొడవలు సద్దుమణిగినట్టేనా?

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇండస్ట్రీలోని పలువురు బిగ్ హీరోలతో మంచి స్నేహ బంధాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గురూజీ ఇద్దరూ మంచి స్నేహితులు. అలాగే అరవింద సమేత మూవీ చేస్తున్నప్పుడు ఎన్టీఆర్, త్రివిక్రమ్ మధ్య కూడా స్ట్రాంగ్ బాండ్ ఏర్పడింది. దీంతో తమ ఫ్రెండ్షిప్ ని అలాగే కంటిన్యూ చేస్తూ ట్రిపుల్ ఆర్ మూవీ తర్వాత మరోసారి కలిసి మూవీ చేయాలని ప్లాన్ చేసుకున్నారు వీరిద్దరూ. కానీ ప్రొడక్షన్ పార్టనర్షిప్ లో వచ్చిన విభేదాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ కొరటాల శివతో దేవరకు సైన్ చేయగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో గుంటూరు కారం పట్టాలెక్కించారు.

- Advertisement -

నాగ వంశీనే త్రివిక్రమ్, ఎన్టీఆర్ లను ఒక్కటి చేశారా ?

అయితే వీళ్ళిద్దరూ ఇలా మళ్లీ కలిసిపోవడానికి ప్రొడ్యూసర్ నాగ వంశీనే కారణమని తెలుస్తోంది. ఎన్టీఆర్ కు బిగ్ ఫ్యాన్ అయిన నిర్మాత నాగ వంశీ గతంలో జరిగిన గొడవలను వీళ్ళిద్దరూ మరిచిపోయేలా చేసి, టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ వేదికగా త్రివిక్రమ్, గురూజీని ఒక్కటి చేశారని అంటున్నారు. నాగ వంశీ నిర్మించే ప్రతి సినిమాలో త్రివిక్రమ్ కూడా భాగస్వామిగా ఉంటారన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ టిల్లు స్క్వేర్ ఈవెంట్ కు ఎన్టీఆర్ గెస్ట్ గా హాజరు అవ్వడానికి ఇదే కారణం అంటున్నారు. అలాగే నాగ వంశీ నిర్మాతగా, గురూజీ, ఎన్టీఆర్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోందని ప్రచారం జరుగుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు