Nayanthara: సినిమాలకు గుడ్ బై చెప్పనున్న హీరోయిన్

సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. గ్లామర్ తారగా సినిమా రంగంలోకి అడుగుపెట్టి అంచలంచలుగా ఎదిగింది నయనతార. ఈమె కోలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన దగ్గర నుండి ఇంతవరకు వెనుతిరిగి చూసుకోలేదు. తనకి ఏ కథ నచ్చితే ఆ కథను చేసుకుంటూ వెళ్ళింది. అలాగే ఆమె ఏ పాత్రను పోషించిన అభిమానులు ఆదరిస్తూ వెళ్లారు.

అంతేకాదు అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ని సంపాదించుకోవడమే కాకుండా హీరోలతో సరి సమానంగా రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి చేరింది. తెలుగుతోపాటు తమిళంలోనూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి మెప్పించిన నయన్.. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లకు విభిన్నం. ఇటీవల నయనతార ఆమె భర్త విగ్నేష్ శివన్ తెరకెక్కించిన కనెక్ట్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. తాజాగా నయనతార ఓ షాకింగ్ డిసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కొంతకాలం పాటు నయనతార నటనకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తన చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసిన తర్వాత కొంతకాలం పాటు సినిమాలను పక్కన పెడుతుందని అంటున్నారు. పిల్లల ఆలనా పాలన స్వయంగా చూసుకోవడం కోసమే ఆమె ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు సమాచారం.

- Advertisement -

మరి బ్రేక్ మాత్రమేనా, పూర్తిగా సినిమాలకు దూరం అవుతుందా? అనేది కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఇదే సమయంలో సొంత నిర్మాణ సంస్థపై నయనతార పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారట. ప్రస్తుతం నయనతార బాలీవుడ్ లో అట్లీ కుమార్ దర్శకత్వంలో జవాన్ చిత్రంలో నటిస్తోంది. షారుఖ్ ఖాన్.. విజయ్ సేతుపతితో కలిసి ఆమే ఈ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం జూన్ రెండవ తేదీన ప్రేక్షకుల ముందుకి రానుంది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు