Nayanthara: భయపెడుతున్న “కనెక్ట్” ట్రైలర్

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హర్రర్ మూవీస్ తో ప్రేక్షకులను భయపెట్టిన అతికొద్దీ మంది టాలీవుడ్ నటీమణుల్లో నయనతార ఒకరు. నయనతార ఇప్పటికే పలు హారర్ చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తాజాగా మరోసారి కనెక్ట్ అనే చిత్రంతో ప్రేక్షకులను మరోసారి భయపెట్టేందుకు సిద్ధమైంది నయనతార. విగ్నేష్ శివన్ నిర్మాతగా రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ త్రిల్లింగ్ సస్పెన్స్ హర్రర్ జోనర్ మూవీ కనెక్ట్. అశ్విన్ శరవణన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం వరుస అప్డేట్ లు ప్రకటిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు.

తాజాగా గురువారం రాత్రి ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఇండియన్ సినీ చరిత్రలోనే ఇలా అర్ధరాత్రి ఏ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేయలేదు. హర్రర్ సినిమా అయినందువల్ల అర్ధరాత్రి ట్రైలర్ రిలీజ్ చేస్తే సినిమాకి మంచి బజ్ ఏర్పడుతుందని మేకర్స్ ఇలా విడుదల చేశారు. ఈ చిత్రాన్ని తెలుగులో యూవి క్రియేషన్స్ రిలీజ్ చేస్తుంది. 2.22 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. అనుపమ్ కేర్ , సత్యరాజ్ వంటి దిగ్గజనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలలో నటించారు. చాలా ఆసక్తికర విషయాలను ఈ ట్రైలర్ లో చూపించారు మేకర్స్. డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు