Hamsa Nandini: క్యాన్సర్ నుంచి కోలుకున్న నటి

తెలుగు సినీ ప్రేక్షకులకు హంస నందిని గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తన అందంతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది హంస నందిని. వంశీ దర్శకత్వంలో వచ్చిన అనుమానాస్పదం సినిమా ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. అంతకంటే ముందు కూడా ఒకటి రెండు సినిమాలలో నటించినప్పటికీ అవి పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు. అనుమానాస్పదం సినిమా తర్వాత ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఇక గోపీచంద్ లౌక్యం సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్న హంస గతేడాది ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది.

తాను క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు వెల్లడించింది. వంశపారంపర్యంగా వచ్చే రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్న హంస నందిని కొన్ని నెలల తర్వాత క్యాన్సర్ నుంచి కోలుకుంది. అయితే తన తల్లి కూడా ఇదే జబ్బుతో చనిపోయినట్లు గతంలోనే వెల్లడించింది హంస. అయితే తాజాగా ఆమె క్యాన్సర్ నుంచి బయటపడి మళ్లీ షూటింగ్ కి హాజరైనట్లు ఓ సెట్ లో దిగిన ఫోటోలు అభిమానులకు షేర్ చేసింది. ఈ సందర్భంగా ఓ ఎమోషనల్ పోస్ట్ కూడా చేసింది. ” మళ్లీ కెమెరా ముందుకు రావడం సంతోషంగా భావిస్తున్నా. నా పుట్టినరోజును నా సహనటులు, చిత్ర బృందంతో జరుపుకుంటున్నాను. మీ అందరి ప్రేమకు థాంక్స్ చెప్పకుండా ఉండలేను” అని ట్విట్ చేసింది. దీంతో ఆమెకు ప్రశంసల వెల్లువ కురుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు