Keerthy suresh : ఈ మాత్రం దానికి థియేటర్ లో రిలీజ్ చేయడం ఎందుకు ?

ఇటీవలనే రిలీజై, కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన మమన్నాన్ సినిమాను తెలుగులో నాయకుడు పేరుతో డబ్ చేసి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఉదయనిధి స్టాలిన్ హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో కమెడియన్ వడివేలు, ఫహద్ ఫజిల్ ప్రధాన పాత్రలలో నటించారు.

సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ లాంటి అగ్ర నటుల చేత ప్రశంశలు అందుకున్న ఈ చిత్రాన్ని మరి సెల్వరాజ్ డైరెక్ట్ చేసాడు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా తమిళ్ లో జూన్ 29న రిలీజై, బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించింది. దాంతో ఈ సినిమాని తెలుగులో కూడా డబ్ చేసి జులై 14న రిలీజ్ చేసారు. డబ్బింగ్ సినిమా అయినప్పటికీ కంటెంట్ జనాలకు నచ్చి, మెల్లిగా థియేటర్స్ రావడం స్టార్ట్ చేసారు. కానీ అంతలోనే ఈ సినిమా ఓటిటి డేట్ లాక్ చేసి, అఫీషియల్ గా ఎనౌన్స్ చేసారు.

ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాను అన్ని సౌత్ ఇండియన్ భాషల్లో ఈ నెల 27 నుంచి స్ట్రీమింగ్ లోకి తీసుకురాబోతున్నట్టు కాసేపటి క్రితం ప్రకటించింది. తెలుగులో ఈ సినిమా రిలీజై ఇంకా నాలుగు రోజులు కూడా ఇంకా పూర్తవకుండానే అంతలోనే ఓటిటి రావడమేంటని సోషల్ మీడియాలో మీమర్స్ పోస్ట్ లు వేస్తున్నారు. ఈ మాత్రం దానికి ఇక థియేటర్స్ లో ఎందుకు రిలీజ్ చేసారంటూ మండి పడుతున్నారు

- Advertisement -

గతంలో లవ్ టుడే సినిమా విషయంలో కూడా ఇదే విధంగా జరిగింది. లవ్ టుడే సినిమా తెలుగులో రిలీజైన 4, 5 రోజుల్లోనే నెట్ ఫ్లిక్స్ లో తమిళ్ వెర్షన్ రావడంతో ప్రేక్షకులు చాలా డిసప్పాయింట్ అయ్యారు. మళ్ళీ నాయకుడు సినిమా విషయంలోనూ సమె సీన్ రిపీట్ అయింది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు