Malli pelli :నరేష్, పవిత్రల “మళ్ళీ పెళ్లి” రేపే

యాక్టర్ నరేష్ ,పవిత్ర లోకేష్ ల లవ్ ట్రాక్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు, అందరికి తెలిసిన విషయమే . 60 ఏళ్ళ వయసులో ప్రేమలో పడి పెళ్లి చేసుకోబోతున్న ఈ ముదురు ప్రేమికుల , ప్రేమాయణం పై ఒక సినిమా తీస్తున్నారు. మరి ఇంత గొప్ప చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న ఆ గొప్ప దర్శకుడు ఎవరో కాదు యం యస్ రాజు గారు

యం యస్ రాజు గారు ఇండస్ట్రీలో మంచి టెస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ గా చాల మంచి పేరు ఉంది. “నువ్వొస్తానంటే నేనొద్దంటానా “, మనసంతా నువ్వే , మహేష్ బాబు ఒక్కడు , లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఈయన బ్యానర్ లో నుండి వచ్చాయి. అయితే సడెన్ గా మరి ఏమైందో ఏమో గాని ఈయన మనసు మార్చుకొని ప్రొడ్యూసింగ్ జాబ్ కి స్వస్తి చెప్పి ఈ మధ్యనే డైరెక్టర్ గా మారారు.

2008 లో వచ్చిన “వాన” సినిమాతో ఈయన డైరెక్టర్ గా మారిపోయారు . అయితే ఈ సినిమా మంచి హిట్ అవడంతో ఇక ప్రొడ్యూసర్ గా బ్రేక్ తీసుకొని సినిమాలు డైరెక్ట్ చేయడం మొదలు పెట్టాడు. కానీ తరువాత ఆయన తీసిన ఏ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు

- Advertisement -

అయితే ఇప్పుడు ఈయన తెలుగు రాష్టాలని ఒక ఊపు ఊపేసిన నరేష్ -పవిత్రల ప్రేమ కథని ” మళ్ళి పెళ్లి ” అనే పేరుతో సినిమాగా తీశారు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని రేపు రిలీజ్ చేయబోతున్నారు.పవిత్ర లోకేష్ , నరేష్ ఇద్దరు మన తెలుగులో మంచి పేరున్న నటులు.

అయితే వీళ్లిద్దరు కొన్ని చిత్రాలలో భార్య భర్తలు నటించారు.ఇద్దరు డైవర్స్ కపుల్ అవడం తో కనెక్ట్ అయ్యారు , అది కాస్త ప్రేమగా మారి కొద్దీ రోజులుగా సహజీవనం చేస్తున్నారు. ఈ విషయం ఆనోటా , ఈ నోటా పాకి మీడియా వరికి వెళ్ళింది. దాంతో వీళ్లా సహజీవనానికి బ్రేక్ పడి ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ ఒరిజినల్ కథనే యం.యస్ రాజు గారు సినిమా గా తీశారంట. తొందర్లోనే ఈ సినిమా థియేటర్స్ లో విడుదల చేస్తాం ఆయన ప్రకటించారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates,Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు