Namrata: అందుకే సినిమాలు మానేశా

సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్గర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన పనిలేదు. వెండితెరపై హీరో – హీరోయిన్లుగా నటించి నిజజీవితంలో పెళ్లిబంధంతో ఒకటైన జంటల్లో మహేష్ బాబు – నమ్రత కూడా ఒకరు. నమ్రత తెలుగులో నటించిన తొలి చిత్రం వంశీ. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే మహేష్ బాబుతో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. అలా పెద్దల అంగీకారంతో 2005 ఫిబ్రవరి 10న ముంబైలో వీరు వివాహ బంధంతో ఒకటయ్యారు. తాజాగా నమ్రత ఒక మీడియా చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూ కు సంబంధించిన ప్రోమో ని తాజాగా విడుదల చేశారు. ఈ ఇంటర్వ్యూ ప్రోమోలో నమ్రత మాట్లాడుతూ..

“మొదటి నుండి నాకు ఒక మంచి ఫ్రెండ్ మాదిరిగా ఎన్నో విషయాలలో మహేష్ తోడునీడగా నిలిచారు. ఆయన భర్తగా నా లైఫ్ లో దొరకడం నా అదృష్టం. నాకు వంట రాదు. వంట మనిషి ఉంటుంది. ఆమ్లెట్, టీ, కాఫీ, మ్యాగీ వంటివి మాత్రమే నేను చేయగలుగుతాను. అంతకుమించి వంట రాదు. మహేష్ బాబు అయితే పెళ్లి విషయంలో ఫుల్ క్లారిటీ ఉండేవారు. పెళ్లి తర్వాత నటించకూడదని ముందే చెప్పేశారు. మహేష్ తో పెళ్లి జరగడమే నాకు హ్యాపీ మూమెంట్. ఒక తల్లిగా, భార్యగా నా ధర్మాన్ని నిర్వర్తించేందుకే సినిమాలకు దూరంగా ఉంటున్నా. ఇంట్లో మా మధ్య ఎటువంటి వివాదాలు రావు. పిల్లల విషయంలో మాత్రం కొద్దిపాటి చిన్న వివాదం జరుగుతుంది” అని సరదాగా వెల్లడించారు నమ్రత. ఈ పూర్తి ఇంటర్వ్యూ అతి త్వరలో ప్రసారం కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు