Namrata insta post: ఎమోషనల్ పోస్ట్.. దుఃఖానికి కారణం అదేనా..?

Namrata insta post: ఘట్టమనేని కోడలు, ప్రముఖ మాజీ హీరోయిన్ నమ్రత తాజాగా ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.. తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఈ పోస్ట్ చేయడంతో అభిమానులు సైతం ఎమోషనల్ అవుతున్నారు.. ఘట్టమనేని అభిమానులు కూడా ఇంత ఎమోషనల్ అవ్వడానికి గల కారణం ఏమిటి ?నమ్రత ఎలాంటి పోస్ట్ పెట్టింది ? దేని గురించి పెట్టింది? అనే విషయం ఇప్పుడు చూద్దాం..

Namrata insta post:Emotional post.. Is that the cause of sadness..?
Namrata insta post:Emotional post.. Is that the cause of sadness..?

నమ్రత ఎమోషనల్ పోస్ట్..

సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ తన అత్తగారు అయిన ఇందిరాదేవిని స్మరించుకున్నారు. మహేష్ బాబు తల్లి 2022 సెప్టెంబర్ నెలలో తుది శ్వాస విడువగా.. ఆమె మరణించిన కొద్ది రోజులకు కృష్ణ కూడా స్వర్గస్తులయ్యారు 1952 ఏప్రిల్ 20న ఇందిరాదేవి జన్మించారు.. ఇక ఆమె జయంతి నేపథ్యంలో నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ పెడుతూ..” మీరు ఎల్లప్పుడూ మాతోనే ఉంటారు” అంటూ ఇందిరాదేవి ఫోటోని పోస్ట్ చేశారు.. నమ్రత ఇలా పోస్ట్ చేయడంతో అభిమానులు సైతం ఎమోషనల్ అవుతున్నారు.. మహేష్ బాబును ఎప్పుడు కంటికి రెప్పలా కాపాడుకున్న ఇందిరాదేవి మనమధ్య లేకపోవడం చాలా బాధాకరం అంటూ కామెంట్స్ చేస్తూ ఉండడం గమనార్హం..

తల్లిని తలుచుకుంటూ మహేష్ పోస్ట్..

ఇక మహేష్ బాబు కూడా తన తల్లిని తలుచుకుంటూ పోస్టు పెట్టారు.

- Advertisement -

ఇందిరాదేవి సంతానం..

సూపర్ స్టార్ కృష్ణ తన మేనమామ కూతురైన ఇందిరా దేవిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఐదుగురు సంతానం.. అందులో ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు.. మహేష్ బాబు , అన్నయ్య రమేష్ బాబు.. రమేష్ బాబు అనారోగ్యంతో 2022 జనవరి కరోనా సమయంలో తుది శ్వాస విడిచారు. ఆ సమయంలో మహేష్ బాబు కి కరోనా కావడంతో అన్నయ్య ఆఖరి చూపును కూడా చూసుకోలేకపోయారు. ఈ విషయంలో మరింత బాధపడ్డారు మహేష్ బాబు.. ఇక హీరో సుదీర్ బాబు భార్య ఒక అమ్మాయి .. పారిశ్రామికవేత్త , రాజకీయ నాయకుడైన గల్లా జయదేవ్ భార్య మరొక అమ్మాయి..ఇంకొక అమ్మాయి మంజుల. మంజుల మనందరికీ సుపరిచితమే..

మహేష్ బాబు సినిమాలు..

మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో అభిమానులను అలరించారు.. ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాగానే వసూలు రాబట్టింది.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీ గా ఎస్ ఎస్ ఎం బి 29 అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రూ.800 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.. మరో రెండు మూడు నెలల్లో సెట్ పైకి రానున్నట్లు సమాచారం.. జంగిల్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా పాన్ వరల్డ్ గా రిలీజ్ కాబోతోంది. మహేష్ బాబు కూడా ఈ సినిమా కోసం ఇప్పటి వరకు చూడని లుక్ లో మనకు కనిపించబోతున్నట్లు సమాచారం.. ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీని వదిలి బయటకు రాని మహేష్ బాబు.. ఈ ఒక్క సినిమాతో ప్రపంచ స్థాయి గుర్తింపు సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Mahesh Babu (@urstrulymahesh)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు