War – 2: ముంబైకి పయనమైన ఎన్టీఆర్.. షూటింగ్ షురూ..!

War -2 : యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో వార్ -2 చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. యాక్షన్ , థ్రిల్లర్ మూవీ గా వస్తున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే సినిమా షూటింగ్ మొదలవగా ఎన్టీఆర్, హ్రుతిక్ లేకుండానే ఈ సినిమా షూటింగు మొదలుపెట్టారు. స్పెయిన్ లో మొదటి షెడ్యూల్ ని ప్లాన్ చేయగా లాస్ట్ వీక్ ప్రారంభమైన ఈ షెడ్యూల్ శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంది.. అక్కడ ఒక సూపర్ కార్ చేంజింగ్ సీక్వెన్స్ ని తెరకెక్కించినట్లు సమాచారం.. అంతేకాదు అందుకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. ఇకపోతే రెండవ షెడ్యూలు ఎప్పుడు మొదలవుతుంది? ఈ షెడ్యూల్ లో నైనా ఎన్టీఆర్, హ్రుతిక్ రోషన్ పాల్గొంటారా ? అనేది అందరిలో అనుమానం మొదలైంది.. అయితే తాజాగా ఈ అనుమానాలకు తెరదించుతూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముంబై కి వెళ్ళడానికి ఎయిర్పోర్టులో కనిపించారు.

War - 2: NTR went to Mumbai.. Shooting started..!
War – 2: NTR went to Mumbai.. Shooting started..!

వార్ -2 షూటింగ్ కోసం ముంబైకి ఎన్టీఆర్..

తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ కోసం ముంబైకి చేరుకోనున్నట్లు తెలుస్తోంది.. ఎయిర్ పోర్ట్ కి చేరుకొని ముంబైకి వెళ్లనున్నట్లు సమాచారం.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఎక్స్ వీడియో కూడా వైరల్ గా మారుతోంది. మొత్తానికి అయితే వార్ -2 సినిమా షూటింగ్ షెడ్యూల్లో పాల్గొనబోతున్నారు ఎన్టీఆర్. మరోవైపు హ్రుతిక్ రోషన్ కూడా షూటింగ్లో పాల్గొనడానికి వచ్చినట్లు తెలుస్తోంది.ఏది ఏమైనా వీరిద్దరి మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటాయో అనే ఉత్సుకత కూడా అభిమానులలో మొదలైందని చెప్పవచ్చు.

వార్ -1,2 సినిమా విశేషాలు..

2019లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం వార్ -1. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. ఇక స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతుండడంతో ఇప్పుడు వార్ -2 చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి.. ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఈ సినిమాకి కాల్ షీట్లు ఇచ్చినట్లు సమాచారం.. మరి ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎలాంటి పాత్ర పోషిస్తున్నాడు అనే విషయాలపై అభిమానులలో ఎంతో ఆసక్తి నెలకొంది..

- Advertisement -

ఎన్టీఆర్ సినిమాలు..

రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ప్రపంచ స్థాయి గుర్తింపు సొంతం చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో అంతే ప్రతిష్టాత్మకంగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాని కూడా రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నట్లు సమాచారం .. ఇందులో దివంగత నటీమణి శ్రీదేవి కూతురు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కేజిఎఫ్ సినిమాలతో సంచలనం సృష్టించిన ప్రముఖ శాండిల్ వుడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఇక వరుస పాన్ ఇండియా చిత్రాలను ప్రకటిస్తూ బిజీగా దూసుకుపోతున్నారు ఎన్టీఆర్. ఏది ఏమైనా ఎన్టీఆర్ ఇటు సౌత్ అటు నార్త్ రెండింటినీ కవర్ చేస్తూ పాన్ ఇండియా హీరోగా మరింత స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంటున్నారని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు