Nag Ashwin: నాగ్ అశ్విన్ లవ్ స్టోరీ లో భారీ ట్విస్ట్.. ఆగలేక అడిగేసా అంటూ..?

Nag Ashwin.. ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకుడిగా.. తెరకెక్కించింది తక్కువ సినిమాలే అయినా స్టార్ డైరెక్టర్ గా మంచి పేరు సొంతం చేసుకున్నారు.. ముఖ్యంగా ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో పర్వాలేదు అనిపించుకున్న ఈయన మహానటి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు.. అంతేకాదు ఈయన నిర్మాతగా కూడా వ్యవహరించిన విషయం తెలిసిందే.. నాగ్ అశ్విన్ నిర్మాతగా మారి నిర్మించిన చిత్రం జాతి రత్నాలు.. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడమే కాదు భారీ స్థాయిలో కలెక్షన్లు కూడా వచ్చాయి.. ప్రస్తుతం నాగ్ అశ్విన్ ప్రభాస్ తో కల్కి 2898 ఏడి అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన లవ్ స్టోరీ మరొకసారి వైరల్ గా మారింది..

Nag Ashwin:Big twist in Nag Ashwin's love story.. Can't stop asking..?
Nag Ashwin:Big twist in Nag Ashwin’s love story.. Can’t stop asking..?

సినిమాను తలపిస్తున్న నాగ్ అశ్విన్ లవ్ స్టోరీ..

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో లెజెండ్రీ ప్రొడ్యూసర్ గా గుర్తింపు తెచ్చుకున్న వైజయంతి బ్యానర్స్ అధినేత అశ్విని దత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన కూతురు ప్రియాంక దత్ ని నాగ్ అశ్విన్ ప్రేమించి మరీ వివాహం చేసుకున్నారు. 2015లో పెద్దలను ఒప్పించి ప్రియాంక దత్ ను వివాహం చేసుకున్నారు.. 2016 లో వీరికి ఒక కొడుకు కూడా జన్మించారు.. ఇదిలా ఉండగా తాజాగా వీరిద్దరి మధ్య పరిచయం , ప్రేమ ఎలా మొదలైంది? అనే విషయం చాలా మందికి తెలియదనే చెప్పాలి.. అయితే ఈ విషయాలపై డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ నాగ్ అశ్విన్ స్పందిస్తూ.. తమ ప్రేమ, పెళ్లి అందులో ఉన్న ట్విస్ట్ అన్ని కూడా వెల్లడించారు..

పరిచయం అక్కడే..

ప్రొఫెషనల్ గా నేను , ప్రియాంక దత్ కొన్ని యాడ్స్ కోసం పనిచేసాము. ఆ సమయంలోనే మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.. నేను దర్శకత్వం వహించిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాకి ప్రియాంక దత్ నిర్మాతగా వ్యవహరించారు.. ఆ సినిమాతోనే నేను ఆమె ప్రేమలో పడిపోయాను.. కానీ ఈ విషయం ఆమెకు తెలియదు .. అయితే అదే సమయంలో ప్రియాంక దత్ కి ఆమె తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.. అప్పుడు ఏం చేయాలో తెలియక నువ్వు ఎవరినైనా ఇష్టపడుతుంటే వెళ్లి పెళ్లి చేసుకో లేకపోతే మనం పెళ్లి చేసుకుందాం అంటూ ప్రపోజ్ చేశాను.. కానీ చివరికి నా మనసు ఆమెనే కోరుతూ ఉండడంతో ఆగలేక ఆమె తల్లిదండ్రులకు కూడా ఈ విషయం చెప్పడం జరిగింది.. ఇక నా మంచితనం.. నాపై ఉన్న నమ్మకంతో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు.. అలా మా పెళ్లి జరిగింది అంటూ తెలిపారు నాగ్ అశ్విన్.. ఇకపోతే నాగ్ అశ్విన్ ప్రేమ , పెళ్లి ఎలా జరిగాయో చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. పెళ్లి తర్వాత వీరి కాంబినేషన్లో వచ్చిన మహానటి సినిమా భారీ సక్సెస్ ను అందుకోవడమే కాదు ఏకంగా పలు విభాగాలలో నేషనల్ అవార్డులను కూడా రాబట్టింది.

- Advertisement -

భిన్న అభిప్రాయాలు ఉన్న వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించడానికి కారణం సినిమా అనే చెప్పవచ్చు. 2015లో వీరి పెళ్లి జరగగా.. పలువురు సినీ సెలబ్రిటీలు వీరి వివాహానికి హాజరయ్యారు. అంతేకాదు ఇప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా వీరి వివాహానికి హాజరయ్యారు. అటు సినీ సెలెబ్రిటీలు ఇటు రాజకీయ నాయకుల మధ్య వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు