Sobhita and Naga Chaitanya : సోషల్ మీడియా వల్ల మళ్ళీ దొరికిపోయిన శోభిత, నాగ చైతన్య

Sobhita and Naga Chaitanya : గత కొంతకాలంగా అక్కినేని నాగ చైతన్య, తెలుగు హీరోయిన్ శోభిత దూళిపాళ్ల మధ్య ప్రేమాయణం నడుస్తోంది అంటూ రూమర్లు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి వీళ్ళిద్దరూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి. ఆ రెండు పోస్టులూ ఒకే విధంగా ఉండడంతో మరోసారి వీళ్లిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందంటూ టాక్ మొదలైంది. మరి ఇంతకీ నాగచైతన్య, శోభిత సోషల్ మీడియా పోస్టుల వెనక ఉన్న స్టోరీ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…

మాజీ సెలబ్రిటీ కపుల్ నాగచైతన్య, సమంత విడాకుల తర్వాత సినిమాల మీద ఫోకస్ చేశారు. కానీ వాళ్ళు చేసే పోస్టులు మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి. తన మాయోసైటిస్ కు చికిత్స తీసుకుని ఆరోగ్యంగా తిరిగొచ్చిన సామ్ హాట్ హాట్ ఫొటోలతో ట్రీట్ ఇస్తుంటే, ఇక ఇటు నాగచైతన్య సినిమాలతో బిజీ అయిపోయారు. కానీ విడాకులు ప్రకటించిన కొంతకాలం నుంచే నాగ చైతన్య మళ్లీ తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ్లతో ప్రేమలో పడ్డాడని, త్వరలోనే ఆమెను వివాహం కూడా చేసుకోబోతున్నాడని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. దానికి తగ్గట్టుగానే చాలా రోజుల క్రితం లండన్ లో ఇద్దరు ఒకే ఫోటోలో కనిపించారని వార్తలు వచ్చాయి.

త్వరలోనే శోభిత అక్కినేని ఇంటికి రెండవ కోడలుగా అడుగు పెట్టబోతోంది అనే ప్రచారం జోరుగా సాగింది. ఆ రూమర్లపై శోభిత గానీ, ఇటు నాగ చైతన్య గానీ స్పందించలేదు. కొంత కాలానికి రూమర్లు చల్లబడ్డాయి. కానీ తాజాగా మరోసారి వీళ్ళిద్దరూ చేసిన పోస్టులు ఒకే విధంగా ఉన్నాయి అంటూ చర్చ మొదలైంది.

- Advertisement -

తాజాగా శోభిత ధూళిపాళ్ల వెకేషన్ కి వెళ్ళిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆమె మహారాష్ట్రలోని నాగ్పూర్ దగ్గరలో ఉన్న తిపేశ్వర్ అనే ఒక వైల్డ్ లైఫ్ శాంచరికి ట్రిప్ వెళ్ళింది. అందులో భాగంగానే అక్కడ దిగిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది ఈ బ్యూటీ. అయితే దాదాపుగా అదే సమయానికి నాగ చైతన్య కూడా అలాంటి వైల్డ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను పోస్ట్ చేశాడు. వీళ్ళిద్దరూ ఒకే ఫోటోలో కలిసి కనిపించకపోయినా, వాళ్ల పోస్టులలో ఉన్న బ్యాక్గ్రౌండ్ కు మాత్రం చాలా దగ్గర పోలికలు ఉండడంతో శోభిత, నాగ చైతన్య కలిసే వెకేషన్ కి వెళ్లారు అనే రూమర్ మొదలైంది. మొత్తానికి మరోసారి వీళ్లిద్దరి సోషల్ మీడియా పోస్టులు హాట్ టాపిక్ గా మారాయి.

ఇక రీసెంట్ గా శోభిత ధూళిపాళ్ల మంకీ మాన్ అనే మూవీతో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ త్వరలోనే ఇండియాలో కూడా రిలీజ్ కాబోతోంది. మరోవైపు నాగచైతన్య ప్రస్తుతం తండేల్ అనే మూవీతో బిజీగా ఉన్నాడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అక్టోబర్లో తండేల్ థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు