Month of Madhu : ఒక టికెట్ పై రెండు సినిమాలు -ఆసక్తి రేపుతున్న”మంత్ ఆఫ్ మధు” ట్రైలర్

Month of Madhu

నవీన్ చంద్ర, కలర్స్ స్వాతి, హీరో హీరోయిన్స్ గా వస్తోన్న లేటెస్ట్ సినిమా “మంత్ ఆఫ్ మధు” ట్రైలర్ రిలీజయింది. ఇటీవల కాలంలో వస్తోన్న తెలుగు సినిమాలలో మంత్ ఆఫ్ మధు  సినిమా ట్రైలర్ కట్ బెస్ట్ అని చెప్పవచ్చు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంటోంది.

2020 లో నవీన్ చంద్ర హీరోగా వచ్చిన భానుమతి రామకృష్ణ సినిమాను తెరకెక్కించిన శ్రీకాంత్ నాగోతి. మంత్ ఆఫ్ మధు సినిమాకు దర్శకత్వం వహించారు. గత కొన్నేళ్లుగా సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్న స్వాతి  చాలా రోజుల తరువాత ఈ సినిమాలో ఒక ప్రాముఖ్యమైన పాత్ర పోషించినట్టు తెలుస్తుంది.

ఇక ట్రైలర్ విషయానికొస్తే రెండు విభిన్న పార్శ్వాలలో ఈ కథ సాగుతోందని తెలుస్తోంది. అమెరికా నుంచి వచ్చిన మధుమతి ఒక నెల రోజుల పాటు ఇండియా లో ఉండటానికి వస్తుంది. అమెరికా కల్చర్ కు అలవాటు పడిన ఆమె కొన్ని రోజులకు మధుసూదన్ రావు( నవీన్ చంద్ర ) ను కలుస్తుంది. మధుసూదన్ రావు లేఖ( స్వాతి )ల వైవాహిక జీవితంలో ఎదురైనా కొన్ని కీలమైన సంఘటనలు మీద కథ ఉండబోతుందని ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. అయితే ఇటీవల కాలంలో కమర్షియల్ సినిమాల పుణ్యమా అని సెన్సిటివ్ సబ్జెక్ట్ ల మీద సినిమాలు రావడం చాలా వరకు తగ్గాయి. మంత్ ఆఫ్ మధు ట్రైలర్ ను బట్టి ఈ లోటును ఈ సినిమా భర్తీ చేసేలాగే ఉంది. మంజుల ఘట్టమనేని, వైవా హర్ష, రాజా రవీంద్ర ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో నటిస్తోన్నారు. అక్టోబర్ 6న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవబోతుంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు