Meter: కిరణ్ అబ్బవరం మరోసారి తెర మీదకు… ట్రైలర్ డేట్ ఖరారు.

టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా తన స్వయం కృషి తో హీరో అవ్వాలని ఇండస్ట్రీ కి వచ్చిన వాళ్లలో ‘కిరణ్ అబ్బవరం’ ఒకడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి పెద్ద హిట్స్ ఏమి లేకపోయినా, తనదయిన శైలిలో డిఫరెంట్ కాన్సెప్టులతో ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉన్నాడు. ఈ హీరో ప్రేక్షకులకు సుపరిచితమే. సమ్మతమే సినిమా తో హిట్ అందుకున్న ఈ హీరో ఆ తరువాత ‘వినరో భాగ్యము విష్ణు కథ‘ తో మరో సారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఈ సినిమా కలెక్షన్ల పరంగా బాగానే వసూళ్లు చేసింది కానీ ఆవరేజ్ టాక్ తోనే కొనసాగింది. ఇక తాజాగా ఈ హీరో మరో సినిమా ని అనౌన్స్ చేసాడు. ఈ సినిమా లో రమేష్ కదిరి దర్శకత్వంలో అతుల్య రవి హీరోయిన్ గా నటించగా, సప్తగిరి, పోసాని కృష్ణ మురళి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా ని మైత్రి మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మించగా, డిజిటల్ స్ట్రీమింగ్ పార్టనర్ ‘నెట్ఫ్లిక్’ అని కూడా ప్రకటించారు.

ఈ సినిమా నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మార్చ్ 29న మీటర్ సినిమా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేసేందుకు నిర్ణయించారు. ఈ విషయాన్నీ సోషల్ మీడియా వేదికగా మేకర్స్ మరియు నటుడు కిరణ్ సబ్బవరం అధికారికంగా ప్రకటించారు. ఈ హీరో కెరీర్ లో ఈ సినిమా ఎలాంటి మార్పులు తీసుకొని రానుందో వేచి చూడాల్సి ఉంది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు