Tollywood : మారుతీ ప్రభాస్ టైటిల్ రాజా డీలక్స్ కాదంట !

ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై వస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఎవరికీ తెలియకుండా, ఎలాంటి అప్డేట్ లేకుండా రహస్యంగా చేస్తున్నారు. నిజానికి ఈ సినిమా కూడా అఫీషియల్ ఎనౌన్స్ చేసి పెద్ద లెవెల్ లో చేద్దామని ప్లాన్ చేసారంట మూవీ యూనిట్, కానీ ప్రభాస్ ఇందుకు ఒప్పుకోలేదంట. ఎందుకంటే ప్రతి సినిమాని ఆఫిషల్ గా లాంచ్ చేసి ఫ్యాన్స్ కి అప్డేట్స్ వాళ్ళ కామెంట్స్ చూస్తూ ఈ ప్రొజిజర్ అంత ప్రభాస్ చిరాకు తెప్పించిందంట, అందుకే ఈ సినిమా షూట్ అయ్యేదాకా ఎలాంటి హడావిడి చేయకండి అని చెప్పారంట.  దాంతో చేసేదెం లేక ప్రొడక్షన్ వాళ్ళు ఒకే అన్నారంట అందుకే ఈ సినిమా షూట్ లొకేషన్స్ కూడా ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు.

ప్రభాస్ కి జోడిగా ఈ సినిమాలో మాళవిక మోహన్ , నిధి అగర్వాల్ , రిడ్డి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే ఇది ఒక హర్రర్ సినిమా అని టాక్. మల్టీ జానర్స్ ఎలిమెంట్స్ తో ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా సింపుల్ గా ఉండబోతుందంట. ప్రభాస్ స్క్రిప్ట్ ఒకే చేయడానికి కూడా ఇదే కారణం అంట. ఎటు చుసిన పెద్ద, పెద్ద సెటప్ లు, స్టార్ యాక్టర్స్ , జనాలు ,గోల,  లాంటివి ఎక్సపీరియన్స్ చేసిన ప్రభాస్ మారుతీ సినిమాకి వీటన్నిటిని దూరం పెడుతున్నారంట. అయితే ఎంత పకడ్బందీగా ఉన్న కూడా ట్విట్టర్ లో అక్కడ ,ఇక్కడ ప్రభాస్ పిక్స్ వైరల్ అవుతూనే ఉన్నాయ్.

అయితే ఈ సినిమాకి రాజా డీలక్స్ అని పేరుని ముందుగా పరిశీలించిన టీం ఇప్పుడు ఆ పేరు ని క్యాన్సల్ చేసి వేరే పేరుని పెడుతున్నారని టాక్ .ప్రభాస్ పెద్ద నాన్న కృష్ణం రాజు హీరోగా వచ్చిన పాత సినిమా టైటిల్ ని పెట్టడానికి మూవీ టీం ఒకే చెప్పారు అంట. అయితే మరి ఏ టైటిల్ పెడతారు అనేది ఇంకా కన్ఫామ్ కాలేదు. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ జూన్ 16న రిలీజ్ అవబోతుంది. ఈ సినిమా తరువాత మారుతీ -ప్రభాస్ సినిమా వివరాలను ఆఫిషల్ గా ఎనౌన్స్ చేస్తారని టాక్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు