Mahesh Babu.. ప్రస్తుత రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పరిస్థితి మరీ అద్వానంగా మారిపోయింది. గత ఎన్నికల సమయంలో టీడీపీ పై పూర్తిస్థాయిలో విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ నేడు టీడీపీ కి వత్తాసు పలుకుతూ సూపర్ స్టార్ కృష్ణ పై చేసిన కామెంట్లు అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. అంతేకాదు సూపర్ స్టార్ కృష్ణకు మహేష్ బాబుకు అండగా అభిమానులు నిలవడంతో పాటు ఆంధ్ర సీఎం జగన్ కి కూడా మద్దతు పలుకుతున్నారు..
అప్పుడు అలా..
ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఏడాది ఎన్నికల సమయంలో.. టీడీపీ కుంభస్థలంపై కొడితే బద్దలు అయ్యి కింద మోకాళ్ళ మీద కూర్చొని..తలవంచాలి తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ చెబుతున్నాను.. మీరు ఎన్నోసార్లు నన్ను అవమానించారు.. ఎన్నోసార్లు ఛీ కొట్టారు. నేను మీ ఆత్మ గౌరవాన్ని కాపాడాను… కనీసం చిన్నపాటి గౌరవం లేకుండా నన్ను అడ్డగోలుగా నెలలకు నెలలు సంవత్సరాలకు సంవత్సరాలకు హింసించారు.. లోకేష్ కి కూడా ఇదే చెబుతున్నా.. నేను మీకు అండగా ఉండి 15 కి 15 సీట్లు మీకు ఇస్తే.. మీరు నా తల్లిని దూషించారు.. తెలుగుదేశం పార్టీని ఇటు లోకేష్ ని క్షమించను.. మర్చిపోకండి ఖబర్దార్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రచారం చేశారు.
ఇప్పుడు ఇలా..
అయితే ఈ ఏడాది ఎన్నికలలో పొత్తులో భాగంగా టిడిపికి వత్తాసు పలికారు పవన్ కళ్యాణ్. నందమూరి తారక రామారావు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అందరూ సినీ తారలు ఆయనకు సహకరించలేదు.. కొంతమంది కాంగ్రెస్లో కూడా ఉన్నారు.. ముఖ్యంగా కృష్ణ కాంగ్రెస్లో ఉన్నారు .ఎన్.టి. రామారావుని విమర్శించేవారు. ఏ రోజు కూడా ఎప్పుడు కూడా కృష్ణని ఎన్టీ రామారావు విమర్శించింది లేదు. అది ఎన్టీఆర్ సంస్కారం. తెలుగుదేశం పార్టీతో కూడా నాకు విభేదాలు ఉన్నాయి ..కానీ ఎప్పుడు వ్యక్తిత్వంగా కూర్చోబెట్టి నా సినిమాలను ఎప్పుడు ఆపలేదు. అంటూ సూపర్ స్టార్ కృష్ణ ను దూషిస్తూ సంభాషించారు.
పవన్ పై ఫైర్ అవుతున్న సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్..
ఇక ఈ విషయం తెలుసుకున్న కృష్ణ , మహేష్ బాబు అభిమానులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. అసలు కృష్ణని అనే స్థాయి వాణికుందా.. ఒకే ఏడాది 18 సినిమాలు విడుదల చేశారు.. ఈయన ఒక్క సినిమా రిలీజ్ చేస్తే అది బ్రేక్ ఈవెన్ అవుతుందో దిక్కు దివానా లేని పరిస్థితి. కృష్ణ గారెక్కడ.. ఆయనెక్కడ.. సూపర్ స్టార్ కృష్ణను అనే అర్హత ఆయనకు లేదు..ముఖ్యంగా మహేష్ బాబు ఫ్యాన్స్ అసలు సపోర్ట్ చేయము.. కేవలం జగనన్నను చూడడానికి తెలంగాణ నుంచి వచ్చాము.. టాలీవుడ్ కింగ్ మహేష్ బాబు. ఆంధ్ర కింగ్ జగనన్న. భవిష్యతరానికి ఏవైనా ఇవ్వగలరా అంటే అది చదువు మాత్రమే.. అది జగనన్న ఇస్తున్నారు.. అది ఎవరు గమనించడం లేదు.. ఏమైనా అంటే ఏపీ వెనుకబడిపోయింది ..మరో శ్రీలంక అవుతుంది అని చెబుతున్నారు. జగనన్న ప్రవేశపెట్టే పథకాలని చంద్రబాబు పేరు మార్చి పెడుతున్నారు… అంతకుమించి మీరు చేసింది ఏమీ లేదు అంటూ మహేష్ అభిమానులు పవన్ కళ్యాణ్ పై, చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.