GunaSekhar: మహేష్ బాబు చాలా డేంజరస్ పర్సన్

పీరియాడికల్ సినిమాలను తెరకెక్కించడంలో డైరెక్టర్ గుణశేఖర్ కు ఉన్న ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఆయన చేసిన సినిమాల్లో సెట్స్ కు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అందుకే అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో చేసిన రుద్రమదేవి ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తర్వాత, దాదాపు 8 ఏళ్ల తర్వాత ఈ డైరెక్టర్ నుంచి వస్తున్న తాజా చిత్రం శాకుంతలం. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ పిరియాడికల్ చిత్రం సమ్మర్ కానుకగా ఏప్రిల్ 14న విడుదల కానుంది.

దీంతో శాకుంతలం ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో డైరెక్టర్ గుణశేఖర్ ఇంటర్వ్యూలకు అంటెడ్ అవుతున్నారు. అలా ఓ ఇంటర్వ్యూలో సూపర్ స్టార్ మహేష్ బాబు పై డైరెక్టర్ గుణ శేఖర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనాలను క్రియేట్ చేస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబును గుణ శేఖర్.. చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని అన్నాడు.

“మహేష్ బాబు ప్రమాదకరమైన వ్యక్తి. ఒక్కసారి ఆయనతో కలిసి సినిమాలు చేస్తే, ఆయనకు ఆడిక్ట్ అయిపోతాం. మళ్లీ మళ్లీ అతనితోనే సినిమాలు చేయాలని అనిపిస్తుంది. అలా నేను మహేష్ బాబు తో మూడు సినిమాలు చేశాను” అంటూ చెప్పుకొచ్చాడు. కాగా మహేష్ బాబు, గుణ శేఖర్ కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ మూవీ ఒక్కడు. ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. డైరెక్టర్ గా గుణ శేఖర్ కు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఈ సినిమాకు గానూ గుణశేఖర్ కు బెస్ట్ డైరెక్టర్ విభాగంలో ఒక నంది అవార్డ్ తో పాటు ఒక ఫిల్మ్ ఫేర్ అవార్డ్ కూడా వచ్చింది.

- Advertisement -

దీని తర్వాత బ్యాక్ టూ బ్యాక్ అర్జున్.. సైనికుడు సినిమాలు చేశాడు. కాగా, మహేష్ తో మరో సినిమా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు గుణ శేఖర్ చెప్పాడు. అయితే ఈ తరం హీరోల్లో ఒక్క డైరెక్టర్ తో వరుసగా మూడు సినిమాలు చేసిన హీరో ఎవరూ లేరని, అందుకే కొంత గ్యాప్ ఇచ్చినట్టు చెప్పుకొచ్చాడు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు