Kollywood : టాలీవుడ్ కు క్యూ !

కోలీవుడ్ స్టార్ హీరో సూర్యji తెలుగు లో ఎటువంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. 2005లో విడుదలైన గజినీ సినిమాతో సూర్య ji అటు తమిళ్ ఇటు తెలుగు లో విపరీతమైన క్రేజ్ పెరిగింది. సూర్య ఎంచుకునే కథలు, అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యాడు. కాగా 2006 లో సహనటి జ్యోతిక ను వివాహం చేసుకున్నాడు సూర్య. అయితే ఇప్పటి వరకు సూర్య పూర్తి స్థాయి తెలుగు చిత్రంలో హీరోగా నటించలేదు. అయితే సూర్య కూడా గత కొన్నాళ్లుగా తెలుగులో స్ట్రైట్ మూవీ చేయాలని అనుకుంటున్నాడట. కానీ అది సాధ్యం కాలేదు. గతంలోనే సూర్య – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెలుగు సినిమా చేయబోతున్నారని వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ అది జరగలేదు.

సూర్య – బోయపాటి కాంబినేషన్లో సింగం వంటి మాస్ యాక్షన్ సినిమా చేయాలని అనుకున్నారట. కానీ అది కార్యరూపం దాల్చలేదు. అయితే తాజాగా మరోసారి సూర్య తెలుగు స్ట్రైట్ మూవీ గురించి పెద్ద ఎత్తున వార్తలు వినబడుతున్నాయి. హీరో గోపీచంద్ నటించిన “శౌర్యం” సినిమాతో దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శివ, తమిళంలో స్టార్ హీరో అజిత్ తో వరుస హిట్ సినిమాలను అందిస్తూ స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ క్రమంలోనే శివ దర్శకత్వంలో సూర్య తెలుగులో మూవీ చేయబోతున్నారని, ఈ చిత్రాన్ని యూవి బ్యానర్ లో నిర్మిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సూర్య ప్రస్తుతం బాలా దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్. ఈ చిత్రం పూర్తవగానే తెలుగులో చిత్రం గురించి అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.

ఇప్పటికే కోలీవుడ్ నుండి డైరెక్టర్లు, నటీ నటులు టాలీవుడ్ కు వస్తున్నారు. ఇక్కడ సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పుడు సూర్య కూడా టాలీవుడ్ పై ఆసక్తి చూపడంతో, కోలీవుడ్ మొత్తం టాలీవుడ్ వైపు క్యూ కడుతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు