Itlu Maredumilli Prajaneekam : చీఫ్ గెస్ట్ లుగా యంగ్ హీరోలు

అల్లరి నరేష్.. కెరీర్ ప్రారంభంలో ఒక కామెడీ హీరోగానే చూసే వారు. కెరీర్ లో మొదటి సినిమా అల్లరి నుంచి 2021 బంగారు బుల్లోడు వరకు పక్క జోనర్ లోకి తొంగి చూడకుండా కేవలం కామెడీ యాంగిల్ లోనే సినిమాలు చేశాడు. అందులో కొన్ని విజయాన్ని కట్టిపెట్టగా, చాలా వరకు బాక్సాఫీస్ ముందు బోల్తాపడ్డాయి. దీంతో తన పంథాను మార్చుకుని, మొదటిసారి తన జోనర్ ను విడిచి విజయ్ కనకమేడలతో నాంది అనే సినిమా చేశాడు.

ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అల్లరి నరేష్ కెరీర్ లోనే బిగ్గేస్ట్ హిట్ గా నిలిచింది. చాలా ఎళ్ల తర్వాత హిట్ రుచి చూసిన అల్లరి నరేష్ తన తర్వాత సినిమాను విజయ్ కనకమేడలతోనే చేస్తున్నాడు. వీరి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం. ఈ సినిమా ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ తో సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తి పెరిగింది.

ఇటీవల విడుదలైన ట్రైలర్ తో అంచనాలు భారీగా పెరిగాయి. అల్లరి నరేష్ మరోసారి నాంది లాంటి హిట్ కొట్టేలా ట్రైలర్ ఉందని సినీ విశ్లేషకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ రోజు సాయంత్రం పార్క్ హయత్ లో జరగనుంది. దీనికి చీఫ్ గెస్ట్ లుగా యంగ్ హీరోలు శ్రీ విష్ణు, విశ్వక్ సేన్ హాజరు కాబోతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు