NTR : ఎన్టీఆర్ కు జగన్ సారీ చెప్పాలంటున్న ఫ్యాన్స్…!

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడూ హాట్ టాపిక్ అనే చెప్పాలి. 2009 ఎలక్షన్స్ లో అతను తన తాతగారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ తరుపున ప్రచారం చేశాడు. ఆ టైంలో పార్టీ గెలవకపోయినా భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ సాయం టీడీపీకి అవసరమని తేలింది. ఇప్పుడు ఆ పార్టీలో స్ట్రాంగ్ మెంబర్ గా చంద్ర బాబు తప్ప ఇక ఎవ్వరూ కనిపించడం లేదు.

కాబట్టి పార్టీకి ఎన్టీఆర్ అవసరం అనే వాదన ఎప్పుడూ వినిపిస్తూనే ఉంది. కానీ ఎన్టీఆర్ మాత్రం రాజకీయాలు నడిపే వయసు అనుభవం తనకి లేదని సినిమాల పరంగా సాధించాల్సింది చాలా ఉంది అంటూ తారక్ చాలా సార్లు చెప్పుకొచ్చాడు.

అయితే ఏదో ఒక విధంగా కొంతమంది పొలిటీషియన్లు ఎన్టీఆర్ పై నోరు పారేసుకుంటూనే ఉన్నారు. తాజాగా వైసిపి మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబు, లోకేశ్ ఈ రాష్ట్రానికి పట్టిన శని. ఇది జనాలు అంటున్న మాటే. లోకేష్ బాబు పోతే జూనియర్ ఎన్టీఆర్ లేకపోతే బోనియర్ ఎన్టీఆర్ అంటూ టీడీపీ నేతలు అంటున్నారు అంటూ అంబటి అన్నారు.

- Advertisement -

ఇవి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఆగ్రహం తెప్పించాయి. దీంతో ఎన్టీఆర్ కు అతను క్షమాపణలు చెప్పాలని జగన్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు. ట్విట్టర్ వేదికగా వాళ్లు #JaganShouldApologizeJrNTR అనే హ్యాష్ ట్యాగ్ ను ఇండియా వైడ్ ట్రెండ్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు