Tollywood : ఈ సీనియర్ హీరోయిన్లు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో తెలుసా?

Tollywood :  సౌత్ సీనియర్ హీరోయిన్లు చేతిలో సినిమాలు లేకపోయినప్పటికీ పారితోషికం విషయంలో మాత్రం తగ్గేదే లే అంటున్నారు. కెరీర్ చివరి దశకు వచ్చిందనే ఆలోచన కూడా లేకుండా రెమ్యూనరేషన్ విషయంలో పట్టుబట్టి కూర్చుంటున్నారు. ఇండస్ట్రీలోకి రోజుకో కొత్త హీరోయిన్ వస్తున్నప్పటికీ, నిలదొక్కుకునే వాళ్ళు మాత్రం కరువయ్యారు. ఇదే ఇప్పుడు సీనియర్ హీరోయిన్లకు అదనుగా మారింది. ఈ నేపథ్యంలోనే సినిమా సినిమాకు రెమ్యూనరేషన్ పెంచుకుంటూ పక్కా కమర్షియల్ హీరోయిన్లు అనిపించుకుంటున్నారు వీళ్ళు. నయనతార, కాజల్, రష్మిక మందన్న, సమంత, అనుష్క తదితరులు ఈ లిస్ట్ లో ఉన్నారు. మరి ఇంతకీ వీళ్లంతా ప్రస్తుతం ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అనే వివరాల్లోకి వెళ్తే….

1. నయనతార

లేడీ పవర్ స్టార్ నయనతార క్రేజ్ రోజురోజుకు పెరుగుతోందే తప్ప తగ్గట్లేదు. దాన్నే ఈ బ్యూటీ క్యాష్ చేసుకుంటుంది. ప్రస్తుతం నయనతార సౌత్ లోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా రికార్డును మెయింటైన్ చేస్తోంది. జవాన్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత ఈ అమ్మడు ఒక్కో సినిమాకు 10 కోట్లు డిమాండ్ చేస్తుంది.

2. త్రిష

చెన్నై చిన్నది త్రిష సీనియర్ హీరోలు అందరికీ ఇప్పుడు బెస్ట్ ఆప్షన్ గా మారింది. ఈ సీనియర్ హీరోయిన్ చేతిలో ప్రస్తుతం ఆరడజను సినిమాలు ఉన్నాయంటే ఆమె పాపులారిటీ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. త్రిష ఒక్కో సినిమాకు 4 కోట్లు పారితోషకంగా తీసుకుంటుందని ప్రచారం జరుగుతుంది.

- Advertisement -

3. సమంత

అనారోగ్యం కారణంగా గత కొంతకాలం నుంచి సినిమాలకు దూరంగా ఉన్న సమంత రీసెంట్ గా రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. గతంలో పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం ఈ అమ్మడు ఏకంగా 1.20 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంది. తాజాగా సిటాడెల్ అనే వెబ్ సిరీస్ కోసం 10 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్టు సమాచారం. ఒక్కో సినిమాకు 6 కోట్లు పారితోషికంగా తీసుకుంటుందట సమంత.

4. కాజల్ అగర్వాల్

ఒక పిల్లాడికి తల్లయినప్పటికి కాజల్ డిమాండ్ ఇంకా తగ్గలేదు. ఈ బ్యూటీ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 2 కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది.

5. పూజ హెగ్డే

బుట్ట బొమ్మకు ఇటీవల కాలంలో అవకాశాలు కరువయ్యాయి. సౌత్ మేకర్స్ ఆమె వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. సౌత్ లో ఐరన్ లెగ్ గా ముద్ర వేసుకున్న ఈ అమ్మడు బాలీవుడ్ లో మాత్రం బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు హిందీ సినిమాలు ఉన్నాయి. పూజ ఇప్పుడు ఒక్కో సినిమాకు 3 కోట్లు పారితోషకంగా తీసుకుంటోంది.

6. అనుష్క శెట్టి

స్వీటీ లేట్ గా అయినా లేటెస్ట్ గా అన్నట్టుగా నెమ్మదిగా సినిమాలు చేస్తోంది. బాహుబలి తర్వాత ఇప్పటిదాకా ఒకటి రెండు సినిమాల్లో మాత్రమే కనిపించింది. ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో ఓ మూవీలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ కన్నడ భామ 4 కోట్లకు పైగానే పారితోషికం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

6. శృతిహాసన్

గత ఏడాది నుంచి శృతిహాసన్ హవా మామూలుగా లేదు. ఆమె కాలు పెట్టిందంటే సినిమా హిట్టే అనే సెంటిమెంట్ మొదలైపోయింది. శృతి దీన్నే క్యాష్ చేసుకుంటోంది. సినిమా పెద్దదా చిన్నదా అని తేడా లేకుండా 2 కోట్ల వరకు డిమాండ్ చేస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు