Mohan babu: అర్తీ అగర్వాల్ అంత చెత్త పని చేసి.. ఆ హీరోకి 10 లక్షలు ఇచ్చిందా ?

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మోహన్ బాబు బ్యానర్ లో ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. ఇక ఈ క్రమంలోనే తన సొంత బ్యానర్ లో తప్పుచేసి పప్పుకూడు అనే సినిమాని కూడా నిర్మించారు. ఇక ఈ సినిమాకి కోదండరామిరెడ్డి దర్శకుడిగా పనిచేయగా, ఈ సినిమా కోసం హీరోయిన్గా నటించడానికి ఆర్తి అగర్వాల్ ను సంప్రదించారు. ఆర్తి అగర్వాల్ కూడా ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకుంది.

సినిమా షూటింగ్ మొదలవుతుంది అనే సమయంలో తనకు పరీక్షలు ఉన్నాయని చెప్పి ఈ సినిమా నుంచి తప్పుకున్నారు ఆర్తి అగర్వాల్. ఇక అలా ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఈ సినిమాలో హీరోయిన్ గా గ్రేసి సింగ్ ను ఎంపిక చేశారు. షూటింగ్ పనులు జరుగుతున్నప్పుడు మోహన్ బాబుకి అసలు విషయం తెలిసింది. ఇక ఆ అసలు విషయం ఏమిటంటే, పరీక్షల కారణంగా ఆర్తి అగర్వాల్ ఆ సినిమా నుంచి తప్పుకోలేదని, పరీక్ష పేరును అడ్డుపెట్టుకొని మరొక సినిమాలో నటిస్తోంది అనే విషయం ఆయన తెలుసుకున్నారు.

దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మోహన్ బాబు వెంటనే తనని ఫిలిం ఛాంబర్ కు పిలిపించి ఫిలిం ఛాంబర్ లో ఆమెపై కంప్లైంట్ చేసి 10 లక్షల రూపాయలు కట్టించారు మోహన్ బాబు. ఇక ఈ విషయం అప్పట్లో పెద్ద ఎత్తున సంచలనానికి దారితీసింది

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు