కోలీవుడ్ స్టార్ ‘చియాన్ విక్రమ్’ నటించిన లేటెస్ట్ చిత్రాల్లో “ధ్రువనక్షత్రం” ఒకటి. తమిళ్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా దాదాపు ఐదేళ్ల కిందటే మొదలైంది. కొన్ని కారణాల వల్ల షూటింగ్ లో జాప్యం కారణంగా ఆలస్యంగా తెరకెక్కింది. ఇక లాక్ డౌన్ టైం నుండి వాయిదా పడుతూ వస్తున్న ధ్రువ నక్షత్రం ఎట్టకేలకు రిలీజ్ కి రెడీ అయింది. ఇక విక్రమ్ హీరోగా నటించిన ఈ సినిమాలో రీతూ వర్మ హీరోయిన్ గా నటించింది.
లేటెస్ట్ గా ధ్రువ నక్షత్రం ట్రైలర్ కూడా రిలీజ్ కాగా, ట్రైలర్ ని గమనిస్తే సినిమా టేకింగ్ ట్రైలర్ కట్స్ మొత్తం గౌతమ్ మీనన్ స్టైల్ లో స్టైలిష్ గా ఉండి ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో 26/11 ముంబై దాడుల తర్వాత ఒక భారత సీనియర్ రాయబారి, ఇండియా కోసం ఆర్మీ తో సంబంధం లేకుండా ఒక టీమ్ ని తయారు చేస్తాడు. ఆ టీమ్ లో పది మంది ఉండగా, పదకొండో వాడిగా టీమ్ లీడర్ గా వచ్చేవాడే హీరో. వాళ్ళకి ఇచ్చిన మిషన్ ని సక్సెస్ ఫుల్ గా ఎలా పూర్తిచేశారన్నదే ఈ సినిమా స్టోరీ.
ఇక ఈ సినిమా లో గౌతమ్ మీనన్ కూడా ప్రత్యేక పాత్రలో నటించగా, పార్తీబన్, సిమ్రన్, రాధికా శరత్ కుమార్, వంశీ కృష్ణ, వినాయకన్ కీలకపాత్రల్లో నటించారు. ట్రైలర్ లో వచ్చిన బీజీఎమ్ కూడా బాగానే ఉంది. అయితే సినిమా క్వాలిటీ చూస్తుంటే ఐదేళ్ల కింద తీసిన సినిమా లాగే ఉంది. అయితే కంటెంట్ బాగుంటే సినిమా హిట్ అవ్వడం ఎవ్వరూ ఆపలేరు. ఇక ధ్రువ నక్షత్రం సినిమా నవంబర్ 24న థియేటర్లలో రిలీజ్ కానుంది.
For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News