ప్రముఖ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ “అన్ని మంచి శకునములే”. స్వప్న సినిమా బ్యానర్ లో ప్రియాంక దత్ నిర్మాతగా వైజయంతి మూవీస్ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రం మే 18 న విడుదలకు సిద్ధం అవుతుంది. ఇక ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి, షావుకారు జానకి, వెన్నెల కిషోర్, రమ్య సుబ్రహ్మణ్యన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. మిక్కి.జె.మేయర్ ఈ సినిమాకు సంగీతం అందించారు. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఘనంగా జరిగింది.
అన్ని మంచి శకునములే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ నందిని రెడ్డి మాట్లాడుతూ ఇంత పెద్ద స్టార్ కాస్ట్ తో తాను మొదటిసారి పనిచేశానని, తన కెరీర్లో చాలా ఇష్టపడి తీసిన సినిమా ఇది అని చెప్పారు. అలాగే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ లు గా హాజరైన నాని, దుల్కర్ సల్మాన్ కు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పింది. అంతే కాకుండా ఈ సినిమాకి పని చేసిన యూనిట్ అందరికి కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రేక్షకులు థియేటర్ లో నుంచి వెళ్లేప్పుడు హాయిగా ఒక మంచి సినిమా చూశామని వెళ్తారని, ఇది తన ప్రామిస్ అని అన్నారు.
ఇక తాజాగా నందిని రెడ్డి ప్రామిస్ కి తోడు సెన్సార్ బోర్డు కూడా “అన్ని మంచి శకునములే” సినిమాకు క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చింది. అంటే అన్ని వర్గాల ప్రేక్షకులు చూసే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్నమాట. దీంతో నందిని రెడ్డి తో పాటు చిత్ర యూనిట్ ఇంకాస్త జోరు పెంచి ప్రమోషన్లు చేస్తున్నారు. ఇక “అన్ని మంచి శకునములే” సినిమా ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో మే18న తేలిపోతుంది.
For More Updates :
Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.