Akhanda2: బాలకృష్ణ సంచలన నిర్ణయం.. ఇక నుంచి మాస్ మసాలా సినిమాలకి గుడ్ బాయ్

ఇన్నాళ్ళకి నందమూరి బాలకృష్ణ తన సినిమా కథల విషయంలో రూటు మార్చినట్టుగా అనిపిస్తుంది. గత కొన్నేళ్లుగా ఆయన సినిమాల్లో తొడ కొడితే బాంబులు పేలడాలు, మీసం తిప్పితే సుమోలు గాల్లోకి ఎగరడాలాంటి విన్యాసాలు చేస్తూ వస్తున్న..బాలకృష్ణ ప్రస్తుతం అలాంటి సినిమాలకి బ్రేక్ చెప్పి, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాపై దృష్టి పెట్టనున్నాడు.

అయితే ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ ఒక సినిమా చేస్తున్నాడు. కాజల్ హీరోయిన్ గా, యంగ్ టాలెంటెడ్ శ్రీలీల ప్రధాన పాత్రలో ఈ సినిమా రాబోతుంది. బాలీవుడ్ విలక్షణ నటుడు అర్జున్ రాంపాల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. అయితే తెలంగాణ బ్యాక్డ్రాప్ లో మాస్ మసాలా యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా తరువాత బాలయ్య, బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ2 సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమా రాబోయే ఆంధ్ర ప్రదేశ్ ఎలక్షన్స్ ని ఆధారంగా చేసుకొని, ప్రచారంలో భాగంగా రాబోతుంది.

ఈ రెండు సినిమాల తరువాత బాలకృష్ణ మాస్ మసాలా సినిమాలకి బ్రేక్ ఇచ్చి, కంటెంట్ బేస్డ్ సినిమాలపై దృష్టి పెట్టనున్నట్టు సమాచారం. అఖండ2 సినిమా తరువాత బాలయ్య, యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట, ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మనే స్వయంగా ఇంటర్యూ లో చెప్పారు. బాలయ్య, ప్రశాంత్ వర్మ కలిసి ఆహా లో స్ట్రీమ్ అవుతున్న అన్స్టాపబుల్ షో చేసారు. ఆ షో ద్వారా పరిచయమైన ఈ ఇద్దరు ఆ షో షూటింగ్ సమయంలో వీళ్లా కాంబినేషన్ లో సినిమా చేయడం గురించి మాట్లాడుకున్నారట, ప్రశాంత్ వర్మ తన దగ్గర ఉన్న ఐడియాని బాలయ్యతో షేర్ చేసుకోగా ఆయన కూడా ఒకే చెప్పాడని టాక్. అయితే ఈ సినిమా ఇదివరకు ఉన్న బాలయ్య బాబు సినిమాల కాకుండా కంప్లిట్ గా ప్రశాంత్ వర్మ స్టయిల్ లో కొత్త ఉండబోతుందని సమాచారం. ప్రస్తుతం హనుమాన్ సినిమా పనుల్లో బిజీ గా ఉన్న ప్రశాంత్ వర్మ ఈ సినిమా తరువాత బాలయ్య బాబు సినిమా పనులు స్టార్ట్ అవుతాయని టాక్.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు