Trinadha Rao Nakkina..ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.. టాలీవుడ్, కోలీవుడ్ , బాలీవుడ్ ఇలా పలు ఇండస్ట్రీలలో అప్పుడప్పుడు చాలామంది సెలబ్రిటీలు లేదా వారి కుటుంబీకులు మరణిస్తూ అభిమానులకు తీవ్ర దుఃఖంలోకి పడేస్తూ వుంటారు గడిచిన రెండు రోజుల క్రితం బుల్లితెర నటి లాస్య ఇంట తీవ్ర విషాద ఛాయలు ఏర్పడ్డాయి.. ముఖ్యంగా ఈమె భర్త మంజునాథ తండ్రి మరణించారు. అలాగే కోలీవుడ్ నటుడు అరుల్ మణి కూడా అస్వస్థతకు గురై మరణించారు. ఇప్పుడు తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ గా పేరు పొందిన డైరెక్టర్ త్రినాధరావు ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.
డైరెక్టర్ తండ్రి మృతి..
టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరుపొందిన నక్కిన త్రినాధరావు.. ఇంట విషాద ఛాయలు నెలకొన్నాయి..ఆయన తండ్రి అనకాపల్లిలో మృతి చెందినట్లుగా తెలుస్తోంది. త్రినాధ రావు సొంత ఊరు అనకాపల్లి.. అయినప్పటికీ ఉద్యోగరీత్యా హైదరాబాద్ కి వచ్చి.. ఆ తర్వాత ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలు పడి చివరికి డైరెక్టర్ గా మారిపోయారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ రోజు త్రినాధరావు నక్కిన తండ్రి మరణించగా.. ఆయన అంత్యక్రియలు కుటుంబ సభ్యుల మధ్య రేపటి రోజున నిర్వహించబోతున్నారు. అయితే ఈ కార్యక్రమానికి సినీ సెలబ్రిటీలు నటుడు సందీప్ కిషన్, నిర్మాత రాజేష్ తదితరులు సైతం వెళ్ళబోతున్నట్లు సమాచారం.
త్రినాథ రావు నక్కిన సినిమాలు..
రవితేజ నటించిన ధమాకా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈ డైరెక్టర్.. ఇటీవల నిర్మాతగా మారి తన బ్యానర్ పైనే చౌర్యపాఠం అనే ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మొట్టమొదటిసారిగా ప్రియతమా నీవచట కుశలమా అనే సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన త్రినాధరావు.. మేం వయసుకు వచ్చాం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ త్రినాధరావు నక్కిన రవితేజతో తెరకెక్కించిన ధమాకా సినిమాతో భారీ క్రేజ్ ను అందుకున్నారు.
స్టార్ హీరోలే కాదు యంగ్ హీరోలతో కూడా పనిచేసిన డైరెక్టర్..
అయితే అంతకంటే ముందు హలో గురు ప్రేమ కోసమే , నేను లోకల్ , సినిమా చూపిస్త మావ, నువ్వలా నేనిలా, నేను లోకల్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. ఒకవైపు రచయితగా, మరొకవైపు డైరెక్టర్గా మంచి పేరు తెచ్చుకున్న త్రినాధ రావు నక్కిన ఇద్దరి లోకం ఒకటే అనే సినిమాలో నటుడిగా కూడా నటించారు.. తెలుగు చిత్రాలే కాకుండా మరాఠీ చిత్రాలకు కూడా రచయితగా పనిచేశారు ఈ డైరెక్టర్..
జీవిత విషయాలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి లో పుట్టి పెరిగిన ఈయన ఆ తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టి దర్శకుడిగా కెరియర్ మొదలుపెట్టాడు. ఆ తర్వాత రచయితగా మారాడు. ఇప్పుడు నిర్మాతగా కూడా మారి పలు సినిమాలలో నిర్మిస్తున్నా.. అవకాశం వచ్చినప్పుడు అక్కడక్కడ పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.