ఎంతోమంది సినిమాలలోకి ఫ్యాషన్ తో వస్తే.. మరికొంతమంది ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అడుగుపెడుతూ ఉంటారు. అయితే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగా వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ అక్కడ పనిచేసిన వారికే ఆ బాధలు తెలుస్తాయని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇప్పటికే చాలామంది సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి మంచి క్రేజ్ ఉన్నట్టుగానే అవకాశాలు తగ్గిపోయి.. కొంతమంది ఆర్థికంగా నిలదొక్కుకోలేక.. అప్పులు బాధలు భరించలేక కొంతమంది ఆత్మహత్య చేసుకుంటే.. మరికొంతమంది హోటల్స్ లో పనిచేస్తూ లేదా ఇతర రంగాలలో పనిచేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ఒకప్పుడు బాలీవుడ్ స్టార్స్ అయినా ఆయుష్మాన్ ఖురానా, రాజ్ కుమార్ రావు, ప్రియాంక చోప్రా లతో కలిసి నటించారు. ఆయన ఎవరో కాదు సోలంకి దివాకర్.. ఇలా ఎంతోమంది పెద్ద స్టార్స్ తో నటించిన ఈయన ఇప్పుడు ఉన్నట్టుండి పండ్ల వ్యాపారి లాగా మారిపోయి అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇకపోతే సోలంకి దివాకర్ సినిమాల్లోకి రాకముందు వృత్తిరీత్యా పండ్ల వ్యాపారి గానే పనిచేసేవారు. ఢిల్లీలో ఒకప్పుడు చేపట్టిన ఈ వృత్తే ఇప్పటికీ ఆయన కొనసాగిస్తూ ఉండడం గమనార్హం. నటన పైన ఉన్న ఇష్టం తోనే సినిమాల్లోకి వచ్చానని కరోనా సమయంలో లాక్ డౌన్ విధించినప్పుడు.. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డానని ఆయన చెప్పుకొచ్చారు.
ఇక సినిమాలలో నటించినా కూడా ఆర్థికంగా ఎన్నో కష్టాలు చవి చూశానని ఆయన చెప్పుకొచ్చారు. ఇక అందుకే కుటుంబ పోషణ కోసం తాను పండ్ల వ్యాపారం లోకి వచ్చానని సోలంకి దివాకర్ కామెంట్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. నటన అంటే నాకు మొదటి నుంచి చాలా ప్రేమ.. సినిమాల పైన మక్కువతోనే థియేటర్లలో అప్పడాలు కూడా అమ్మేవాడిని.. ఆ తర్వాత సినిమాలలోకి వచ్చాను. ఇప్పటికీ సినిమాలలో అవకాశాలు వచ్చినా సరే కుటుంబాన్ని పోషించడానికి సరిపడా డబ్బులు రావడం లేదు. అందుకే పండ్ల వ్యాపారిగా మారాల్సి వచ్చింది. బాలీవుడ్లో ప్రియాంక చోప్రా వంటి స్టార్ హీరోయిన్లతో కలిసి నటించిన కూడా నాకు సరిపడా డబ్బులు రావడం లేదు. 1000 సినిమాలలో అవకాశం వచ్చినా సరే నటిస్తాను. కానీ కుటుంబ పోషణకు డబ్బు అవసరం చాలా ఉంది. అందుకే ఇలా పండ్ల వ్యాపారిగా మారి కుటుంబ పోషణ కోసం నా వంతు ప్రయత్నం చేస్తున్నాను అంటూ సోలంకి దివాకర్ చెప్పుకొచ్చారు. ఇక ఆయన చేసిన కామెంట్లు చూసి అభిమానులు సైతం బాధపడుతున్నారు.