Urvasivo Rakshasivo : యూత్‌ని టార్గెట్‌గా

భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన GA2 పిక్చర్స్ లో రాబోతున్న తదుపరి చిత్రం “ఊర్వశివో రాక్షసివో” కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఎబిసిడి లాంటి చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకుని జనాదరణ పొందుకున్న అల్లు శిరీష్ తాజా చిత్రం “ఉర్వశివో రాక్షసివో” ఈ చిత్రానికి “విజేత” సినిమా దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రంలో శిరీష్ సరసన “అను ఇమ్మాన్యూల్” హీరోయిన్ గా నటించింది. ఇదివరకే రిలీజ్ చేసిన “ఊర్వశివో రాక్షసివో” చిత్ర టీజర్ కు, అలానే సాంగ్స్ కు అనూహ్య స్పందన లభించింది.తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను అధికారికంగా రిలీజ్ చేసారు. రిలీజ్ చేసిన ట్రైలర్ లో శిరీష్, అను ఇమ్మాన్యూల్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరినట్లు కనిపిస్తుంది. ఈ సినిమాలో డైలాగ్స్ యూత్ ను ఆకట్టుకుంటాయి.”ఇన్ని ఇ.ఎమ్.ఐ లు ఉన్నోడు ఏ అమ్మాయి గురించి ఆలోచించకూడదురా” “అయినా లైసెన్స్ లేకుండా బండి నడపడం తప్పు రాజా, ఈ రోజుల్లో లైసెన్స్ లు ఆర్.సి లు ఎవరు అడుగుతున్నారు సర్ హెల్మెట్ ఉంటె చాలు” లాంటి డైలాగ్స్ ఖచ్చితంగా యూత్ కి కనెక్ట్ అవుతాయి.

ట్రైలర్ మొదటి నుండి చివరివరకు రొమాంటిక్ ఫీల్ తో యూత్ ని అట్రాక్ట్ చేసే విధంగా ఉంది. అనూప్‌రూబెన్స్,అచ్చు రాజమణి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని జీఏ-2 పిక్చర్స్‌ధీరజ్ మొగిలినేని నిర్మించారు. విజయ్ ఎం సహానిర్మాత‌గా వ్యవహారించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు