నటి అభినయ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మాస్ మహారాజా రవితేజ, అల్లరి నరేష్, శివబాలాజీ కలిసి నటించిన శంభో శివ శంభో సినిమాతో మంచి గుర్తింపునే సంపాదించింది అభినయ. వినికిడి సమస్యలతో పాటు మాటలు రాని అందాల తార ఈ చిత్రంలో రవితేజ చెల్లెలిగా నటించి మెప్పించింది. అంతేకాదు.. ఈ చిత్రానికి తెలుగు ఫిల్మ్ఫేర్ ఉత్తమ సహాయ నటి అవార్డు అందుకుంది అభినయ. తెలుగుతో పాటు తమిళంలో కూడా చాలా సినిమాల్లో నటించింది.
మరోవైపు తమిళ నటుడు విశాల్ ఓ వైపు సినిమాలు తీస్తూనే మరోవైపు పాలిటిక్స్ లో ఎప్పుడూ వార్తల్లో ఉంటాడు. ఇప్పుడు ప్రేమ, పెళ్లి అనే రూమర్స్తో వార్తల్లో నిలుస్తాడు విశాల్. గతంలో పలుమార్లు విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు వినిపించాయి. తొలుత వరలక్ష్మీ శరత్ కుమార్తో ప్రేమలో ఉన్నాడని.. పెళ్లి కూడా చేసుకోబోతున్నాడనే వార్తలు వినిపించాయి. ఇక ఆ తరువాత హైదరాబాద్కి చెందిన ఓ యువతితో విశాల్కి నిశ్చితార్థం కూడా అయింది. పెళ్లి పీటలెక్కకుండానే రద్దయిపోయింది. ఆ తరువాత విశాల్ పెళ్లిపై రకరకాల వార్తలు వినిపించాయి.
ప్రస్తుతం ప్రముఖ హీరోయిన్ అభినయతో విశాల్ ప్రేమలో ఉన్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని సామాజిక మాద్యమాలు హోరెత్తుతున్నాయి. వాస్తవానికి రవితేజ హీరోగా నటించిన ‘నేనింతే’ సినిమాలో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది అభినయ. ఆ తరువాత కింగ్, శంభో శివ శంభో, దమ్ము, ఢమరుకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ధృవ, రాజు గారి గది ఇటీవల వచ్చిన సీతారామం సినిమాలో కూడా గుర్తుండిపోయే పాత్రలో నటించింది. విశాల్ హీరోగా నటిస్తున్న ‘మార్క్ ఆంటోని’ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ తరుణంలోనే విశాల్తో ప్రేమ, పెళ్లి వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ వార్తలపై ఇప్పటికి వరకు విశాల్ స్పందించలేదు. కానీ నటి అభినయ తాజాగా స్పందించింది. ”మార్క్ ఆంటోని సినిమాలో విశాల్కి భార్యగా నటిస్తున్నాను. రీల్ లైఫ్లో భార్యగా నటిస్తే.. రియల్ లైఫ్లో భార్య కాగలమా” అని రూమర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో విశాల్, అభినయల ప్రేమ, పెళ్లి వార్తలకు పులిస్టాప్ పడినట్టయింది.